పవన్ ఫ్యాన్స్‌తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఆన్ లైన్‌లో తనకు ఉపయోగపడతారనుకున్న వారిపై పొగడ్తలు.. తనకు ఇష్టం లేని వారిపై తిట్లు కురిపిస్తూ టైం పాస్ చేస్తూంటారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో లొల్లి పెట్టుకున్నారు, వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. విశ్వరూప చూపిస్తానని.. నోరు తెరిస్తే తట్టుకోలేరనే వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఇదంతా ఎందుకంటే… అన్ స్టాపబుల్ షోలో బండ్ల గణేష్.. పవన్ కల్యాణ్ కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదన్న అర్థంలో పవన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీంంతో బండ్లను పవన్ ఫ్యాన్స్ టీజ్ చేశారు.

దీంతో బండ్ల గణేష్ రెచ్చిపోయారు. నోరు తెరిస్తే గుండె ఆగిపోయి చస్తావ్ నన్ను గెలకొద్దు అంటూ రెచ్చిపోయారు. అసలు ఈ అంశంపై స్పందించకపోతే సరిపోయేది కానీ ఇలా రెచ్చిపోయి బండ్ల గణేష్ మొత్తం రచ్చ రచ్చ చేసుకున్నారు. బండ్ల గణేష్ తో సినిమాలు చేసిన వారు ఎవరూ.. మరోసారి ఆయనతో సినిమాలు చేయలేదు. ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు మరోసారి ఫైనాన్స్ చేయరు. ఇంకా చెప్పాలంటే నటులు కూడా ఆయనకు కాల్ షీట్లు ఇవ్వడానికి సిద్ధపడరు.

కానీ సోషల్ మీడియాలో అవసరమైనప్పుడల్లా.. మెగా ఫ్యాన్స్ భజన చేస్తారు. రవితేజ ను టైగర్ అంటారు. తనకు టీఆర్ఎస్ ఎంపీని గాడ్ ఫాదర్ అంటారు. ఇలా ఆయన… సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటూ వస్తున్నారు. పవన్ తో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ తీశారు. అది బ్లాక్ బస్టర్ అయింది. అయినా పవన్ కు రెమ్యూనరేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్న విషయం మాత్రం అందరికీ క్లారిటీ వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close