రాజ్‌భవన్‌ను కూడా విశాఖకే ఇచ్చిన బీసీజీ..!

జగన్ అనుకున్నది.. ముందు నుంచీ చెబుతున్నదే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక రూపంలో ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పోలిస్తే..బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విశాఖపట్నానికి మరింత అడ్వాంటేజ్ ఇచ్చిది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంపాఫీస్, గవర్నర్ రాజ్ భవన్, అత్యవసర అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ … కూడా పెట్టాలని సూచించింది. అంటే.. వ్యవస్థలన్నీ.. విశాఖలో ఉన్నట్లే. అమరావతిలో అసెంబ్లీ భవనం ఉంటుంది. అందులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో లేదో చెప్పడం కష్టం. అదే సమయంలో.. ఓ హైకోర్టు బెంచ్ ను.. కూడా ప్రతిపాదించారు. ఇక కర్నూలులో హైకోర్టు ప్రధాన భవనం.. ఇతత ట్రిబ్యునళ్ల ఆఫీసులు ప్రతిపాదించారు. విశాఖలో మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని.. విజయవాడలో లేవని.. బీసీజీ నివేదిక ఇచ్చినట్లుగా.. వివరాలు చెప్పిన ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు సహా.. అన్నీ విజయవాడ నుంచి నడుస్తున్నట్లు ప్రభుత్వానికి గుర్తున్నట్లుగా లేదు. అదే సమయంలో… ఉద్యోగులకు.. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు కావాల్సిన నిర్మాణాలు తొంభై శాతం పూర్తయ్యాయనే విషయాన్ని కూడా.. విస్మరించారు. రాజధాని తరలించడానికి ప్రాతిపదిక కావాలనుకుంటున్న ప్రభుత్వం.. పనిలో పనిగా అమరావతిపై వరద ముంపు అనే రాయి కూడా వేసింది. 2009లో వచ్చిన వరదల్లో అమరావతి ప్రాంతం మునిగిందని చెప్పుకొచ్చింది. నిజానికి ఆ వరదల్లో కర్నూలు కొట్టుకుపోయింది. కర్నూలు జిల్లా మొత్తం అతలాకుతలమయింది. కానీ ప్రస్తుతం అమరావతి ఉన్న గ్రామాలకు మాత్రం ముప్పు రాలేదు. అలాగే.. విశాఖకు ఉన్న తుపాన్ల ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హుదూద్ దెబ్బకు.. మొత్తం వ్యవస్థలన్నీ.. నెల రోజులకుపైగా.. పని చేయని పరిస్థితి.. అక్కడ ఉంది.

ఈ రెండింటితో పోలిస్తే.. అమరావతిలోనే ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని బీసీజీతో చెప్పించింది ప్రభుత్వం. అమరావతి ఖర్చు విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదనను బీసీజీ నివేదికలో చెప్పుకొచ్చింది. రాజధానిపై లక్ష కోట్లు ఖర్చు పెడితే.. అంత సొమ్ము తిరిగి రాదని చెప్పింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నామో.. ఓ బ్లూప్రింట్ విడుదల చేశారు. అందులోని విషయాలే.. చాలా పేజీల్లో నిండిపోయి ఉంది. చివరికి ప్రభుత్వానికి కావాల్సిన నివేదికను.. బీసీజీ పొందు పర్చింది. ప్రభుత్వం అనుకున్నట్లుగా విశాఖకు అనుకూలంగా.. బీసీజీ నివేదిక ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close