బీసీజీ స్టడీ : సెప్టెంబర్ వరకూ లాక్ డౌన్ ఖాయమట..!

భారత్‌లో సెప్టెంబర్ వరకూ లాక్ డౌన్ ఎత్తేయడం సాధ్యం కాదని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేసింది. అంటే… ఆర్థిక సంవత్సరంలో.. ఆరు నెలల పాటు.. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోనే ఉంటుందని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తే… సడలింపులుకూడా సాధ్యం కావని.. జూన్ మధ్య కాలంలోనే… లాక్ డౌన్ సడలింపులు ప్రారంభిస్తారని.. సెప్టెంబర్ మధ్య కాలంలో లాక్ డౌన్ ఎత్తివేయడానికి అవకాశం ఉంటుందని బోస్టన్ గ్రూప్ అంచనా వేసింది. కోవిడ్ -19 కేసులు ఏ దశలోనూ తగ్గవని పెరుగుతూనే ఉంటాయని.. ఈ సంస్థ చెబుతోంది.

కన్సల్టింగ్ గ్రూప్ అయిన ఈ సంస్థ… అంచనాలు వేస్తూ ఉంటుంది. ఎవరైనా రిపోర్టులు అడిగితే రాసి ఇస్తూ ఉంటుంది. పరిశీలన చేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం కూడా రూ. ఏడుకోట్లు పెట్టి.. ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంది. మూడు రాజధానులపై ఒప్పందం చేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే.. అన్నింటినీ పరిశీలించి.. ఓ నివేదిక ఇచ్చేసింది. డబ్బులు పుచ్చుకుంది. అయితే ఇప్పుడు.. ఎవరూ అడగకుండానే..ఏ ప్రభుత్వమూ డబ్బులు ఇవ్వకుండానే. .. కోవిడ్ -19 ప్రభావంపై రిపోర్ట్ రెడీ చేసి.. కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చింది.

లాక్ డౌన్ నిబంధనలు.. ఆరు నెలల పాటు కొనసాగించడం అసాధ్యమని.. ఏ ప్రభుత్వ అధికారిని అడిగినా తేల్చేస్తారు. రాజకీయ నాయకుల్ని అడిగినా చెబుతారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా… లాక్ డౌన్ నిబంధనలు సడలించక తప్పని పరిస్థితి ఉంది. అయితే.. ప్రస్తుతం.. దేశంలో బయటపడుతున్న కేసులు మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారివి.. వారి కాంటాక్ట్ కేసులే కావడంతో.. చాలా వరకూ కేసులు పెరుగుతున్నా.. కంట్రోల్‌లోకి వచ్చిందనే భావనలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చిత్రమైన వాదనతో రిపోర్ట్ విడుదల చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close