ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ అని ఫ‌స్ట్ గ్లింప్స్‌తోనే చిత్ర‌బృందం ప‌రోక్షంగ‌టా చెప్పేసింది. తెలుగు 360కి తెలిసిన ఇన్ సైడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ చిత్రానికి ‘కిష్కింద‌పురి’ అనే టైటిల్ దాదాపు ఖాయ‌మైపోయింది. ఇదే టైటిల్‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు.

‘కిష్కింద‌పురి’ అనేది ఓ ఊహాజ‌నిత ప్ర‌దేశం. ఈ సినిమా క‌థంతా ఆ ఊరి చుట్టే తిర‌గ‌బోతోంది. కోతుల‌కూ, ఈ క‌థ‌కూ ఓ చిన్న‌పాటి లింక్ ఉంది. అందుకే ‘కిష్కింద‌’ అనే ప‌దం టైటిల్ లోకి తీసుకొచ్చారు. హార‌ర్ క‌థ‌ని, మిస్ట‌రీ కోణంలో మొద‌లెట్టి, చాలా ఆస‌క్తిక‌రమైన ట్విస్టుల‌తో ముందుకు తీసుకెళ్లేంత మెటీరియ‌ల్ ఈ క‌థ‌లో ఉంది. అందుకే బెల్లంకొండ తొలిసారి త‌న కెరీర్‌లో ఓ హార‌ర్ సినిమా ఒప్పుకొన్నాడు. అజ‌నీష్‌లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. మ‌రోవైపు బెల్లంకొండ న‌టిస్తున్న ‘టైస‌న్ నాయుడు’ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అది బెల్లంకొండ‌కు 10వ సినిమా. 12వ చిత్రానికి సంబంధించిన పనులూ మొద‌లైపోయాయి. ఈ చిత్రంతో ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేయ‌నున్నారు. విష‌యం ఏమిటంటే 11వ సినిమా షూటింగ్ కంటే 12వ సినిమా షూటింగ్ ముందు మొద‌లుపెడ‌తారు. కానీ విడుద‌ల మాత్రం సంఖ్యాప‌రంగానే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close