‘రాక్ష‌సుడు’ కాంబోలో ‘రుద్రాక్ష‌’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా… ‘రాక్ష‌సుడు’. ఈ సినిమాతో త‌న‌కో కొత్త ఇమేజ్ వ‌చ్చింది. ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శ‌కుడు. త‌న కెరీర్‌లోనూ… ఇది గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కాంబోలో మ‌రో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష‌’ అనే టైటిల్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ర‌మేష్ వ‌ర్మ‌కి ‘ఆర్‌’ సెంటిమెంట్ బ‌లంగా ఉంది. ‘రైడ్‌’, ‘రాక్ష‌సుడు’ రెండూ… ఆర్ అనే అక్ష‌రాల‌తోనే మొద‌ల‌య్యాయి. అందుకే ఈచిత్రానికి ‘రుద్రాక్ష‌’ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు టాక్‌. ఇది కూడా ఓ న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ సినిమా అని తెలుస్తోంది. జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. దాదాపు రూ.65 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. బెల్లంకొండ ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అయినా స‌రే.. ర‌మేష్ వ‌ర్మ‌పై న‌మ్మ‌కంతో ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ట‌. ఆగ‌స్టులో ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఆ వెంట‌నే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొదలెడ‌తార‌ని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close