మంచు లక్ష్మి అప్పు తీర్చని బెల్లంకొండ

కొంత కాలం క్రితం బెల్లంకొండ సురేష్‌కీ మంచు ఫ్యామిలీకి మ‌ధ్య ఓ వివాదం న‌డిచింది. మంచు ల‌క్ష్మికి చెందిన‌…ఓ బంగ్లాలో బెల్లంకొండ సురేష్‌కి సంబంధించిన సినిమా ఒక‌టి చిత్రీక‌రించారు. దానికి సంబంధించిన బ‌కాయిలు దాదాపు రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా.. బెల్లంకొండ స్పందించ‌క‌పోవ‌డంతో.. మంచు ల‌క్ష్మి అనుచ‌రులు కొంత‌మంది బెల్లంకొండ ఆఫీసుకు వెళ్లి గొడ‌వ చేశారు. ఆ త‌ర‌వాత పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. అయితే అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ బాకీ తీర్చ‌నేలేద‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై మంచు ల‌క్ష్మి కూడా ప‌రోక్షంగా స్పందించింది. నిర్మాత పేరు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు గానీ… ”ఓ నిర్మాత న‌న్ను మోసం చేశాడు. 23 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఎగ‌నామం పెట్టాడు. తాను సినిమాలు తీస్తున్నా.. వేరే నిర్మాత పేరుతో విడుద‌ల చేస్తున్నాడు. దాంతో అడ‌గ‌డానికి కూడా అవ‌కాశం లేకుండా పోతోంది” అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంటే.. బెల్లంకొండ బాకీ ఇంకా తీర్చ‌లేద‌న్న‌మాట‌. త‌న‌యుడితో కోట్లు పెట్టుబ‌డి పెట్టి సినిమాలు తీస్తుంటాడు బెల్లంకొండ‌. ఇలా పాతిక ల‌క్ష‌ల ద‌గ్గ‌ర ఆలోచించాడంటే… ఏమ‌ని అర్థం..?? ప‌రిశ్ర‌మ‌లో ఇలా తీర‌ని బాకీలు కోట్ల‌లో ఉంటాయి. అందులో ఇదొక‌టి అనుకోవాలంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close