భూమా కుటుంబంలో టిక్కెట్ల చిచ్చు !

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు వారి పిల్లలకు రాజకీయం నేర్పాలని అనుకున్నారో లేదో కానీ వారి అకాల మరణంతో పిల్లలంతా వారిలో వారు రాజకీయాలు చేసుకుంటున్నారు. భూమా దంపతులకు ముగ్గురు పిల్లలు వీరంతా టిక్కెట్ రేసులో ఉన్నారు. అలాగే భూమానాగిరెడ్డి అన్న కుమారుడు అయిన బ్రహ్మానందరెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ప్రస్తుతానికి వీరంతా కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాని కలసి లేరు. ఎవరిరా జకీయం వారు చేస్తున్నారు.

ఇటీవల చంద్రబాబును భూమా మౌనికారెడ్డి తన భర్త మంచు మనోజ్ తో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన నంద్యాల ఉపన్నికల్లో భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ విస్తృతంగా ప్రచారం చేశారు. ధాటిగా మాట్లాడగల సామర్థ్యం ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. శోభానాగిరెడ్డి లేని లోటును భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ తర్వాత వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె అఖిలప్రియ స్థానంలో ఆళ్లగడ్డ టిక్కెట్ అడుగుతున్నట్లుగాచెబుతున్నారు.

నంద్యాలలో పోటీకి.. భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఆయన నంద్యాలలోపర్యటిస్తున్నారు. తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి గురించి పట్టించుకోకుండానే తిరుగుతున్నారు. తనకు పోటీ చేసే ఆసక్తి ఉందని.. స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో భూమా కుటుంబం నంచి ఇద్దరు ఇంచార్జులుగా ఉండగా. టిక్కెట్ల కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉన్నారు. నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు.

భూమా వారసుల మధ్య ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వార్తలను వారు ఖండిస్తున్నారు. అ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close