అదీ స‌మంత డెడికేష‌న్ అంటే..!

స‌మంత అనారోగ్యం పాలై, చికిత్స తీసుకొంటున్న సంగ‌తి తెలిసిందే. త‌న ఆరోగ్యం గురించి స‌మంత స్వ‌యంగా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ ఇస్తూ వుంది. కొంత‌కాలం సినిమాల‌కు విరామం తీసుకొని.. పూర్తిగా ఆరోగ్యంపైనే ఫోక‌స్ చేయాల‌ని నిర్ణ‌యించుకొంది. త‌న చేతికొచ్చిన సినిమాల్నీ వ‌దిలేసింది. అయితే.. ఖుషి ప్ర‌మోష‌న్ల‌లో మాత్రం పాల్గొంటోంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో పాల్గొంది. అంతేకాదు… హుషారుగా డాన్స్ కూడా చేసింది.

నిజానికి సోమ‌వారం నుంచే స‌మంత ఆరోగ్యం బాలేదు. కానీ… సోమ‌వారం డాన్స్ ప్రాక్టీస్ చేసింది. మంగ‌ళ‌వారం విజ‌య్ తో క‌లిసి లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌మంత బ‌య‌ట‌కు రావ‌డ‌మే క‌ష్టం. అలాంటిది.. డాన్స్‌. లైవ్ షో అంటే మామూలు విష‌యం కాదు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్నా స‌రే… త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ధైర్యం చేసి ముందుకొచ్చింది. స‌మంత ఇప్పుడున్న కండీష‌న్‌లో `ప్ర‌మోష‌న్‌కు రాను` అని చెప్పినా.. ఎవ‌రూ చేయ‌గ‌ల‌గింది ఏం లేదు. కానీ.. త‌న‌కు సినిమాపై ఉన్న ప్రేమ‌తో ప్ర‌మోష‌న్ల‌లో ఓపిగ్గా పాల్గొంటోంది. సోమ‌వార‌మే.. ఛాన‌ళ్ల కోసం కొన్ని ఇంట‌ర్వ్యూలు పూర్తి చేసింది స‌మంత‌. విడుద‌ల‌కు ముందు మ‌రో వారం విరివిగా ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి ఓకే అనేసింది. పారితోషికాలు తీసుకొని, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు రమ్మంటే, ఏవో సాకులు చెప్పి త‌ప్పించుకొనే క‌థానాయిక‌ల కంటే… స‌మంత వెయ్యి రెట్లు న‌యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close