ప్రభుత్వంపై బీజేపీ పోరాటం సీరియస్‌ అనిపించడం లేదా..!?

బీజేపీ నేతలు పదే పదే చలో అంతర్వేదికి ఎందుకు పిలుపునిస్తున్నారు. పోలీసులు కూడా అంతే వేగంగా వారిని ఇళ్లలోనే అడ్డుకుంటున్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన జరిగినప్పుడు.. ఓ సారి చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు . ఉదయం పూట బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విమర్శలు రావడంతో సాయంత్రం అందర్నీ రథం దగ్గరకు అనుమతించారు. సోము వీర్రాజు రథాన్ని పరిశీలించి … ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే అనూహ్యంగా.. మళ్లీ చలో అంతర్వేది అంటూ..కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గతంలో మంత్రులు, ఇతరులు రథాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు గొడవలు జరిగాయి. ఓ చర్చిపై రాళ్లేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నేతల చలో అంతర్వేది కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

గురువారం బీజేపీ నేతలు.. బయలుదేరక ముందే ఇళ్లవద్ద అరెస్ట్ చేశారు. దాంతో ఎవరూ బయటకు రాలేదు. అయితే పట్టువదలని సోమువీర్రాజు ఆరు నూరైనా శుక్రవారం చలో అంతర్వేది నిర్వహిస్తామని సవాల్ చేశారు. అయితే.. శుక్రవారం కూడా పోలీసులు అందర్నీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. దాంతో చలో అంతర్వేదిలో చలో కాకుండానే కార్యక్రమం ముగిసిపోయింది. అయితే..బీజేపీ నేతల అరెస్ట్‌పై ఢిల్లీలో ఉండే జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్‌లకు మండిపోయింది. హుటాహుటిన కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వం మతపరంగా వ్యవహరిస్తోందని.. రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో అమిత్ షాని జీవీఎల్ కోరారు. రాష్ట్ర పరిణామాలపై జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరామని చెప్పుకొచ్చారు.

హైకోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారట్లేదని ..వైసీపీ అధికారంలోకి వచ్చాక..అన్యమత ప్రచారం పెరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా… ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా… అంతా ఫ్రెండ్లీ మ్యాచ్‌గానే చూస్తున్నారు తప్ప సీరియస్‌గా తీసుకోవడం లేదు. దాంతో బీజేపీ నేతలకు పెద్దగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close