బీజేపీ దూకుడు…. విపక్షం నాన్చుడు…

పార్లమెంటు సమావేశాల రెండో రోజూ షరా మామూలే. రెండో రోజు పరిణామాలను బట్టి చూస్తే, కేంద్రం మరింత పట్టు బిగించింది. విపక్షం పట్టు సడలింది. రాష్ట్రాల అంశాల ప్రస్తావన, లలిత్ మోడీ వివాదం అనే రెండు అంశాల్లోనూ బీజేపీ దూకుడుతో ప్రతిపక్షం గుక్క తిప్పుకోలేక పోయింది. వ్యాపం కుంభకోణం, వసుంధర రాజె వివాదం రాష్ట్రాలకు సంబంధించినవి. అయినా వాటిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో రభస చేయడం సరికాదంటూ మొదట రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం చెప్పారు. దానికి నిరసనగా ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది.

పార్లమెంటులో రాష్ట్రాల అంశాలు చర్చించాలని ప్రతిపక్షాలు అంతగా పట్టుబడితే తాము సిద్ధమని జైట్లీ అన్నారు. అయితే కేరళ, అసోం, గోవా ల గురించీ చర్చిద్దామని సవాల్ చేసే సరికి కాంగ్రెస్ గతుక్కుమంది. కేరళలో రెండు మూడు కుంభకోణాలు, అసోం, గోవాల్లో తాజాగా అమెరికా కంపెనీ లంచాల వ్యవహారంపై చర్చించాలనేది జైట్లీ సవాల్ సారాంశం. ఇది కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే విషయం. దీంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. అలా, తమకు మెజారిటీ లేని రాజ్యసభలో కాంగ్రెస్ జైట్లీ చెక్ పెట్టారు. ఆ తర్వాత సీపీఎ: వంతు.

నిన్న తాము చర్చకు ఒప్పుకోలేదని, ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు సుష్మా వివాదంపై కేంద్రం విచారణకు ఆదేశించాలని, అది పూర్తయ్యే వరకు ఆమె పదవిలో ఉండకూడదని వాదించారు. ఈ వాదనమీదా అరుణ్ జైట్లీ ఘాటుగా ఎదురుదాడి చేశారు. సుష్మా ఏ చట్టాన్ని ఉల్లంఘించారని సూటిగా ప్రశ్నించారు. ఏచూరి చాలా మేధావి, ఆమె ఏ చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం విచారణకు ఆదేశించి, మాకు జ్జాన బోధ చేయాలని వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి ఏచూరి సూటిగా జవాబు చెప్పలేక పోయారు.

ఈ దశలో డిప్యుటీ చైర్మన్ జోక్యం చేసుకున్నారు. చర్చకు అనుమతివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం రెడీగా ఉన్నా, ప్రతిపక్షం ఎందుకు వెనక్కి పోతోందని ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్షం బిత్తరపోయింది. సరిగా సమాధానం చెప్పలేని స్థితిలో కేకలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. అనుకున్నట్టే సభ వాయిదా పడింది.

ఈ మొత్తం వ్యవహారంలో విపక్షం వ్యూహం బెడిసికొట్టింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్ని రాజీనామా డిమాండ్లు చేసినా, సభలో చర్చకు ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు చర్చించడం సంప్రదాయం. చర్చ సందర్భంగానే సుష్మాపై విమర్శలు చేస్తూ ఆమె రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. అలా కాకుండా రోజుకో డిమాండ్ తో విపక్షం సభా సమయాన్ని వృథా చేస్తోందని బీజేపీ ఆరోపించే అవకాశం ఇచ్చినట్టయింది. ఒక్కసారి చర్చ జరిగితే ఇక ఈ సమావేశాలు ముగిసే దాకా ఈ అంశాన్ని లెవనెత్తే అవకాశం లేదు. అందుకే, దీనిపై చర్చ విపక్షాలకు ఇష్టం లేనట్టుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close