పార్లమెంట్‌లో ఎత్తులు – పై ఎత్తులు

అనుకున్నదే జరిగింది. లలిత్ మోడీ వివాద ప్రకంపనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సంఖ్యాబలంలో ప్రతిపక్షాలదే పైచేయిగా ఉన్న రాజ్యసభలో రోజంతా మైండ్ గేమ్ నడిచింది. లలిత్ మోడీ వ్వహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె రాజీనామా చేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులందరూ ఈ డిమాండుకు శ్రుతి కలిపారు. తొలిరోజే బీజేపీని వీలైనంత డిఫెన్స్ లో పడేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా కేంద్రం ఈ ఎత్తుకు పై ఎత్తు వేసింది.

ఈ వివాదంపై వెంటనే చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒక్క క్షణం విపక్షం షాకైనట్టు కనిపించింది. కేంద్రం ఇంత త్వరగా చర్చకు ఒప్పుకుంటుందని విపక్షం భావించలేదని అర్థమైంది. అందుకే, వెంటనే చర్చను మొదలుపెట్టకుండా అరుపులు కేకలతో కొందరు సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో సభ పదే పదే వాయిదా పడింది. చివరకు లెఫ్ట్, ఎస్పీ సభ్యులు కొత్త ఎత్తు వేశారు. సుష్మా, వసుంధర రాజీనామా చేసిన తర్వాతే చర్చ మొదలుపెట్టాలని కొత్త డిమాండ్ చేశారు. దీన్ని అధఇకార పక్షం తోసిపుచ్చింది.

వారు రాజీనామా చేస్తే ఇక చర్చ ఏముంటుంది? దీనికి బీజేపీ ఒప్పుకోదని తెలిసే విపక్షం మైండ్ గేమ్ ఆడింది. అధికార పక్షం పదునుగా ఎదురు దాడి చేసింది. ప్రతిపక్షాలకు చర్చమీద నమ్మకం లేదని, సభను అడ్డుకోవడమే వారి ఉద్దేశమని అధికార పక్షం ఆరోపించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం సైతం చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద ఈ సమావేశాల్లోనూ రాజ్యసభలో చర్చకు బదులు అంతా రచ్చ రచ్చ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలు చేసే ఏ డిమాండుకూ తలొగ్గరాదని మోడీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. తనకు మెజారిటీ ఉన్న లోక్ సభలో విపక్షాలను కట్టడి చేయడం కష్టం కాదని కమలనాథులు భావిస్తున్నారు. రాజ్యసభలో ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఎత్తులు పైఎత్తుల మధ్య ప్రజా సమస్యలు, బిల్లులపై చర్చ మాత్రం అనుమానమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close