గుడి కూల్చివేతపై బీజేపీ ఫైర్.. మసీదు మళ్లీ నిర్మిస్తే చాలు అని ఓవైసీ సానుకూలత

కొత్త సచివాలయం నిర్మాణం కోసం.. పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు సోమవారం వరకూ ఆపాలని ఆదేశాలు ఇచ్చింది కానీ.. అప్పటికే నాలుగు రోజులు కావడంతో.. కీలకమైన భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు అందరూ దర్శించుకునే నల్లపోచమ్మ గుడి.. ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలు చేసే మసీదు కూడా ధ్వంసమయ్యాయి. అయితే.. ఈ సంగతి బయటకు రాకుండా.. ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత బయటపడుతుందని అనుకున్నారేమో కానీ.. కేసీఆర్.. వాటిని మళ్లీ నిర్మిస్తామని ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాతే.. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ గుడి.. మసీదు ధ్వంసం అయ్యాయని బయటకు తెలిసింది. దాంతో.. రాజకీయం ప్రారంభమయింది.

నల్లపోచమ్మ గుడిని ఎలా కూలగొట్టారో.. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది గుళ్లు కూలగొట్టడానికి కాదని మండిపడ్డారు. అసలు సిసలైన హిందువు తానేనంటూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించుకున్నారని, కానీ నేడు.. ఆయన గుడి మనిషి కాదని తేటతెల్లమైపోయిందని మురళీధర్ రావు మండిపడ్డారు. ఇతర బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలు కూడా.. గుడిని కూలగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా.. మూఢ నమ్మకాలతో.. కొడుకును సీఎంను చేయడానికి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

మరో వైపు.. మసీదు ధ్వంసం విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాజిటివ్‌గా స్పందించారు. కేసీఆర్ మళ్లీ నిర్మిస్తామన్న ప్రకటనను స్వాగతించారు. సాదారణంగా.. ఎలాంటిదైనా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… మసీదు లాంటి వాటిపై… తొలగింపు లాంటి కారణాలతో చేయి వేస్తే… ఓవైసీల స్పందన వేరుగా ఉంటుంది. పరిస్థితి మారిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం.. దశాబ్దాలుగా ఉన్న మసీదును తొలగించేసి.. వేరే చోట కొత్తది కడతాం అని కేసీఆర్ అనగానే.. ఓకే ..ఓకే అనేశారు ఓవైసీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close