భూముల కేటాయింపు రద్దుపై హైకోర్టుకు అమరరాజా..!

తాము సేల్ డీడ్ అగ్రిమెంట్ ద్వారా ఏపీఐఐసీ దగ్గర భూములు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని.. ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని… ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించిందని.. ఏపీఐఐసి తమకు విక్రయించిందని.. ఒప్పందం ప్రకారం… తాము కల్పిస్తామని చెప్పిన ఉద్యోగాల కన్నా ఎక్కువే కల్పించామని హైకోర్టు దృష్టికి అమరరాజా సంస్థ తీసుకెళ్లింది. దీనిపై ప్రభుత్వ వాదన భిన్నంగా అందులో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పి … ఏర్పాటు చేయలేదని.. అందుకే భూములను వెనక్కి తీసుకునే అధికారం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇంకా ఉల్లంఘనలు ఉన్నాయని… విడిగా వివరణ పత్రం దాఖలు చేస్తామని కోర్టుకు తెలపడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.

చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు గతంలో కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామంటూ.. ఏపీ సర్కార్ ప్రకటించి.. జీవో విడుదల చేసింది. అయితే.. అసలు అవి తమకు ప్రభుత్వం కేటాయించలేదని.. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశామని అమరరాజా వాదిస్తోంది. అదే సమయంలో… ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసేటప్పుడు చేసుకున్న ఒప్పందంలో ఉన్న అన్ని అంశాలను.. ఉద్యోగాలతో సహా నెరవేర్చామని స్పష్టం చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం… చెప్పినన్ని ఉద్యోగాలు కల్పించలేదని వాదిస్తోంది. ఈ విషయంలో ఏమైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటే.. ఏపీఐఐసీ ద్వారా తీసుకోవాల్సి ఉన్నా.. నేరుగా ప్రభుత్వం రంగంలోకి దిగింది.

అన్ని వ్యవహారాలు సేల్ డీడ్ ద్వారా జరిగాయని అమరరాజా వాదిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో.. ప్రభుత్వం రద్దు ఉత్తర్వులు చెల్లవంటోంది. చెల్లుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీఐఐసికి భూములు ఇచ్చింది ప్రభుత్వమే కాబట్టి… ఆ ఏపీఐఐసీ ఇతరులకు ఇచ్చిన భూములను రద్దు చేయడం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని.. వాదించారు. ఈ వాదన కాస్త చిత్రంగా ఉన్నప్పటికీ.. సమర్థించుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరరాజా అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని.. ప్రభుత్వం చెబుతూంటే.. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని.. కావాలంటే.. అడ్వకేట్ జనరల్‌ను తీసుకెళ్లి మొత్తం చూపిస్తామని ఆ సంస్థ చెబుతోంది. ఏ ఉల్లంఘనలు చెప్పి భూములు రద్దు చేశారో.. ఇప్పుడు.. ఆ ఉల్లంఘనలను నిరూపించాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే భూములను రద్దు చేశారని ఆరోపణలు వస్తున్న సమయంలో.. ఈ విషయంలో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close