పాపం ఏపీ బీజేపీ నేతలు.. గాలి తుస్ !

ఏపీ బీజేపీ నేతలకు ఏమీ అర్థం కావడం లేదు. వైసీపీని వ్యతిరేకిస్తే ఓ తంటా.. లేకపోతే మరో తంటా. రెండు వైపుల నుంచి వారికి అక్షింతలు పడుతున్నాయి. తాజాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతును కేంద్ర నాయకులు కూడా అడగలేదని వైసీపీనే మద్దతిచ్చిందని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేసిన చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. తాము వైసీపీ మద్దతు అడిగామని.. ద్రౌపది ముర్ము నామినేషన్‌కు రావాలని ఆహ్వానించామని ఢిల్లీలో తెలిపారు. సత్యకుమార్ మాటలు ఆయన వ్యక్తిగతమని తేల్చారు.

దీంతో ఢిల్లీలో కాస్త పలుకుబడి ఉన్న సత్యకుమార్ గాలి తీసేసినట్లయింది. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా కాస్త గట్టిగా మాట్లాడే నాయకుడు. నేరుగా ఢిల్లీ స్థాయి పదవి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో మిగతా బీజేపీ నేతలతో పోలిస్తే ఆయనకూ ఉన్న ప్రజాదరణ తక్కువే. కానీ పలుకుబడి ప్రకారం చూస్తే ఆయన మిగతా వారి కన్నా ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తే. అలాంటి నేతకే షెకావత్ కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు హైకమండ్ దృష్టికి తీసుకెళ్లి తమను తక్కువ చేస్తున్నారని .. ఖండించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

ఈ కోరిను బీజేపీ హైకమాండ్ అంగీకరించింది. దీంతో ఏపీ బీజేపీ నేతలకు మరోసారి షాక్ తప్పలేదు. ఒక వేళ వైసీపీని సమర్థించినట్లుగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది.. వ్యతిరేకిస్తే ఢిల్లీ నుంచి ఖండనలు వస్తున్నాయి. అందుకే ఏపీ బీజేపీ నేతలకు ఏమీ పాలుపోని పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close