అడగకుండానే టీడీపీ మద్దతు కూడా ఎన్డీఏ అభ్యర్థికే !

ఏపీలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ వైపే అని మరోసారి నిరూపితమయింది. టీడీపీ కూడా బీజేపీ కూడా అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతును ద్రౌపది ముర్ముకే ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గిరిజన తెగకు చెందిన వారు కావడం, దేశంలోనే తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉండడం వల్ల ఆమెకు తాము మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. వైసీపీ కూడా ఇదే కారణం చెబుతోంది. అయితే టీడీపీకి ఉన్న ఓట్ల విలువ అత్యల్పం. మొత్తం ఓటింగ్‌లో అరశాతం కూడా లేవు. దాదాపుగా ఆరు శాతం ఓట్లు ఉన్న వైసీపీ ఏపీ కోసం ఎలాంటి షరతులు.. చర్చలు లేకుండానే బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికింది. ఎలాంటి ప్రభావవంతమైన ఓట్లు లేని టీడీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకి వచ్చేది.. పోయేది ఏమీ లేదు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా గెలిచే పరిస్థితి లేదు. ఈ కారణంగా అనవసరంగా బీజేపీకి వ్యతిరేకం అనిపించుకోవడం ఎందుకని గిరిజన అభ్యర్థి కాబట్టి మద్దతు అనే కాన్సెప్ట్‌తో టీడీపీ ముందుకెల్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close