చిరంజీవిపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుందా..!?

ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవిని … రాజకీయాల్లోకి లాగడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి జనసేన – బీజేపీ పార్టీలు. నాదెండ్ల మనోహర్ అర్థం కాని వ్యాఖ్యలు చేసి చిరంజీవి పేరును ప్రచారంలోకి పెట్టిన ఒక్క రోజులోనే.. సోము వీర్రాజు కూడా అదే పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి భారతీయ జనతా పార్టీ – జనసేన కూటమికి మద్దతిస్తారని సోము వీర్రాజు ప్రకటించుకున్నారు. అదే సమయంలో చిరంజీవి ఏ పార్టీ లోకి వచ్చేది ఆయన ఎక్కడా ప్రకటించ లేదు కానీ.. జనసేన, బిజెపి కి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పారన్నారు. అంటే.. చిరంజీవి రాజకీయాల్లోకి అంటూ వస్తే.. జనసేనలోకే కాదని.. ఇతర పార్టీల్లోకి వస్తాడని ఆయన అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

చిరంజీవి లాంటి జనాకర్షక ఉన్న స్టార్ తమ కూటమికి మద్దతుగా ఉంటే.. బలమైన వర్గం మద్దతు పలుకుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కానీ.. జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో అలాంటి పరిస్థితి ఉండదని తేలిపోయింది. అయితే సోము వీర్రాజు మాత్రం ఏ పార్టీలో చేరుతారో చిరంజీవి చెప్పలేదని వ్యాఖ్యానించడంతో.. ఆయన ఇంకా బీజేపీలో చేరతారన్న ఆశలు పెట్టుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బుధవారం జనసేన నాదెండ్ల మనోహర్ … పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారని ప్రకటించారు. దీంతో చిరంజీవి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని… జనసేనలో యాక్టివ్‌గా ఉంటారని ప్రచారం జరిగింది.

రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి పూర్తి సమయం సినిమాల కోసమే కేటాయిస్తున్నారు. ఎవరైనా రాజకీయ నేతల్ని కలవాలనుకున్నా అది సినిమా రంగ సమస్యల కోసమే స్పందిస్తున్నారు. ఈ తరుణంలో… చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి లాగేందుకు అటు జనసేన.. ఇటు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తాజా ప్రకటనలు నిరూపిస్తున్నాయి. చిరంజీవి కామ్‌గా ఉంటే.. రేపు కాంగ్రెస్ నేతలు కూడా.. ఆయన తమ పార్టీ నేత అని.. త్వరలో యాక్టివ్ అవుతారని ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close