ఏపీలో మళ్లీ మీడియా చానళ్ల బ్యాన్..!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మీడియాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే చానళ్లపై వేటు వేసింది. కొత్తగా ఫైబర్ నెట్ చైర్మన్ అయిన గౌతం రెడ్డి ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని అన్ని జిల్లాల కేబుల్ ఆపరేటర్లను పిలిచి.. ఏబీఎన్‌తో పాటు టీవీ5ని నిలిపివేస్తారా… స్తంభాలపై ఉన్న మీ కేబుళ్లను కట్ చేయమంటారా అని సింగిల్ ఆప్షన్ ఇచ్చారు. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పినా.. అది సీఎం జగన్ ఆర్డర్ అంటూ వీటో చేసి.. మరో ప్రతిపాదన లేకుండా పంపేశారు. అసలేదీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండటం మంచిదనుకున్న కేబుల్ ఆపరేటర్లు ఏబీఎన్, టీవీ5లను నిలిపివేశారు.

పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక్క వైపే వార్తలు తెలుస్తూండటంతో ప్రేక్షకులు కూడా అంత సంతృప్తిగా లేరు. టీడీపీ నేతలతో పాటు ఇతర విపక్ష నేతలు… ఏపీలో మీడియాపై ఆంక్షలను ఖండిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు ఇచ్చిన కనెక్షన్లలో రెండు చానళ్లు రావడం లేదు. డీటీహెచ్ ఉన్న వారికి మాత్రమే ఏబీఎన్ వస్తోంది. అది కూడా లేని వాళ్లు యూట్యూబ్ లైవ్ ను ఆశ్రయిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై అనేకానేక వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని ప్రజల్లోకి వెళ్లకుండా.. ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది.

గతంలోనూ ఇలాగే బ్యాన్ చేయడంతో రెండు చానళ్లు ఢిల్లీ స్థాయిలో రెగ్యులేటరీ సంస్థల దగ్గర న్యాయపోరాటం చేసి ఎలాగోలా మళ్లీ ప్రసారాలను పునరుద్ధరించుకున్నాయి. ఇప్పుడు.. మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేసుకోవాల్సి ఉంది. కానీ అలా చేసుకుని వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది. స్థానిక ఎన్నికలు.. తిరుపతి ఉపఎన్నికలు ముగిసిపోయే అవకాశం ఉంది. మీడియాను చూసి ఎందుకంత భయపడుతున్నారని అధికార పార్టీని విపక్ష పార్టీలు విమర్శించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close