సాగర్‌లో బీజేపీది దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితే..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సారిగా వచ్చిన ఊపు.. ఆ పార్టీకి చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. నాగార్జున సాగర్‌లో పోటీ చేసేది తామంటే తాము అని పోటీ పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినట్లుగా గ్రూపులు ఏర్పడ్డాయి. నిజానికి బలమైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై బీజేపీ కన్నేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకూ అభ్యర్థి కోసం ఎలా ఎదురు చూసిందో.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతే. అక్కడ కాంగ్రెస్‌లో ఉన్న నేతలు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. ఇక్కడ బీజేపీది అలాంటి పరిస్థితే. చివరికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ ముందు కూడా నేతలు టిక్కెట్ కోసం పోటీపడ్డారు.

దాంతో బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని.. ఎవరూ పార్టీ లైన్ దాటరని అనుకున్న ఆయన పరిస్థితి తేడాగా ఉందని… చూసుకోమని బండి సంజయ్‌కు చెప్పి వెళ్లిపోయారు. ఏ క్షణమైనా సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. మే రెండో తేదీనకౌంటింగ్ జరిగే.. ఎన్నికలు తేదీలు ఉండటం ఖాయం. అయితే ఎప్పుడు తేదీలు వస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీంతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు నాగార్జున సాగర్‌లో సమీక్షా సమావేశం పెట్టారు. కనీసం పది మంది నేతలు టిక్కెట్ కోసం పోటీ పడటం.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న వైనం అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి కోసం అందరూ కలిసి పని చేయాలని బండి సంజయ్ సూచించి ఆయన కూడా హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు.

అయితే కాంగ్రెస్ లో ఉన్నట్లుగా అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలోనూ ఎక్కువవుతోందన్న సైటైర్లకు బండి సంజయ్ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గెలిచేది తామే కాబట్టే.. మా పార్టీలో టికెట్ కోసం ఎక్కువ పోటీ ఉందని.. టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడం తప్పులేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్‌లో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రెండు వేలకు కాస్త ఎక్కువ. ఈ సారి పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని టీఆర్ఎస్ చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close