బిహార్ లో కమలవికాసం..ఇదో ఒపీనియన్

బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అక్కడ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికిప్పుడు ఫలితాలను కచ్చితంగా లెక్కగట్టే పరిస్థితిలేకపోయినా, ప్రస్తుతానికి (సెప్టెంబర్ మొదటివారంనాటికి) అందిన ప్రజానాడి ప్రకారం అక్కడ ఈసారి బీజేపీ దాని అనుకూలపార్టీలు కలిసి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటాయని ప్రీపోల్ సర్వే ఒకటి తేల్చిచెప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. 243 స్థానాలున్న అసెంబ్లీలో 122స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేవీలుంటుంది. అయితే బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి మరో మూడు అదనంగా స్థానాలను (125స్థానాలను) గెలుచుకుంటుందని ఇండియా టుడే కోసం సిసెరో చేసిన సర్వేలో ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. జెడి(యు) నాయకత్వంలోని మహాకూటమికి 106దాకా సీట్లు గెలుచుకుని గట్టిపోటీగా నిలుస్తుందని ఓపీనియన్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాగా, ఇతరులు 12చోట్ల గెలవచ్చు. అయితే, ఇంకా అసలు హడావుడి మొదలవలేదు. ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలను పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని నితీశ్ అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ సర్వే ప్రకారం చూసినా నితీశ్ కుమార్ కు అనుకూల పవనాలే కనిపిస్తున్నాయి.

ఐదేళ్ల క్రిందట అధికార జెడి(యు) 115 స్థానాలు గెలుచుకోగా, అప్పటి మిత్రపక్షమైన బీజేపీ 94చోట్ల గెలుపొందింది. ప్రభుత్వఏర్పాటుకు కావాల్సిన సీట్లు ఏ ఒక్క పార్టీకి రాకపోవడంతో అధికస్థానాలు గెలుచుకున్న జేడీయు బిజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా, అప్పటి ఎన్నికల్లో ఆర్ జేడీ 22 చోట్ల, కాంగ్రెస్ నాలుగు, లోక్ జన శక్తి మూడుచోట్ల విజయం సాధించింది.

ప్రస్తుత ఓపీనియన్ పోల్ ఫలితాలను నిశితంగా గమనిస్తే, జెడీయు నాయకత్వంలోని మహాకూటమి పార్టీలు వోట్లలో 40శాతం పంచుకోవచ్చు. ఇది గత ఎన్నికల్లో వోట్ల శాతంతో పోలిస్తే 9.8శాతం తక్కువ. ఇక బీజేపీ దాని మిత్రపక్షాలకు ఈసారి 42వోటుశాతం సొంతం కావచ్చు. ఇది 18శాతం ఎక్కువ. అయితే, నితీశ్ కుమార్ కు వ్యక్తిగతంగా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి అభ్యర్థులైన మిగతా నాయకులు సుశీల్ కుమార్ మోదీ (బీజేపీ) ఆర్ జేడీ నాయకుడు లాలూప్రసాద్ కంటే నితీశ్ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంటుందని ఓపీనియన్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈసారి ఎన్నికలు నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే, నితీశ్ కుమార్ నాయకత్వంలోని మహాకూటమికి మధ్యనే ఉండబోతున్నది.

బిహార్ ఎన్నికలు ఐదుదశల్లో జరుగుతాయి. అక్టోబర్ 12న తొలివిడత పోలింగ్, ఆ తర్వాత అక్టోబర్ 16, తిరిగి 28న, నవంబర్ 1, 5 తేదీల్లో పోలీంగ్ జరుగుతుంది. నవంబర్ 8న ఫలితాలను వెల్లడిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close