అమరావతికి సపోర్టుగా బీజేపీ సభ..! జనసేనకు చోటు లేదా..?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ – జనసేన పార్టీ మధ్య పొత్తు… అంత సవ్యంగా ఉన్న పరిస్థితులు కనిపించడం లేదు. పదో తేదీ తర్వాత బీజేపీతో సంబంధం లేకుండా.. అమరావతి గ్రామాల్లో పర్యటించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా జనసేన ప్రస్తావన లేకుండా.. అమరావతిలో బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ విజయవాడలో సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఇందులో జనసేన ప్రస్తావన వచ్చినప్పటికీ.. అంత సుదీర్ఘమైన చర్చ జరగలేదు.

కలుపుకుని వెళ్లాలని అనుకున్నారు. బహిరంగసభకు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించాలని నిర్ణయించారు. కోర్ కమిటీ మీటింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా… జనసేన గురించి ఎక్కువగా స్పందించలేదు. తాము అమరావతి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పుకున్నారు. అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని… అవసరం అయితే న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. బీజేపీ నేతలు.. కేంద్రం జోక్యంపై మాత్రం మాట్లాడటం లేదు. ప్రత్యేకహోదా అడిగితే.. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని.. జీవీఎల్.. హెచ్చరిస్తున్నారు.

కానీ.. రాజధాని విషయంలో మాత్రం ఇంత కటువు తనాన్ని ప్రదర్శించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ… పట్టించుకోవడం లేదనే అసంతృప్తి… జనసేన అధినేతలో ఉందని.. అందుకే… దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. హడావుడిగా పొత్తు ప్రకటన చేసుకుని.. అంతే హడావుడిగా …దూరం..దూరం అంటున్న జనసేన – బీజేపీ… అమరావతి పోరాటాన్నైనా కలిసి చేస్తాయో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close