మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బహిరంగ సభ

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మార్చి ఆరవ తేదీన రాజమండ్రిలో నిర్వహించబోయే ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ జైన్ తెలిపారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటి కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగింది కనుక రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన మీడియాకి తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సభలో వక్తలు రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడిని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరారు. కానీ వారి నుండి ఆయనకు నిర్దిష్టమయిన హామీ ఏదీ లభించలేదు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాత్రం రైల్వే జోన్ ఏర్పాటుకి సానుకూలంగా స్పందించారు. కానీ అది ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తెలియదు. మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్యాకేజి వంటి ప్రధానమయిన హామీలనన్నిటినీ అమలుచేసి ఉండి ఉంటే ఈ బహిరంగ సభకు మంచి ప్రజాధారణ ఉండేది కానీ వాటిని ఇంతవరకు అమలు చేయకపోవడం వలన ఈ బహిరంగ సభలో పాల్గొనబోయే బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఆ విషయంలో ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోక తప్పదు. ప్రజలకు ఇచ్చిన హామీలను రెండేళ్ళయినా అమలు చేయకుండా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించినా ఆశించిన ప్రయోజనం దక్కక పోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close