జె.ఎన్.టి.యూ.కార్యక్రమానికి ఉగ్రవాది మద్దతు ఉంది: రాజ్ నాద్ సింగ్

ముంబై 26/11 ప్రేలుళ్ళ సూత్రధారులలో ఒకడయిన అఫ్జల్ గురు మూడేళ్ళ క్రితం ఉరితీయబడ్డాడు. డిల్లీలోని జె.ఎన్.టి.యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు ఫిబ్రవరి 9న అతని మూడవ వర్ధంతిని కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ పై దాడికి పాల్పడి, అనేకమంది ప్రాణాలు పోవడానికి కారకుడయిన ఒక ఉగ్రవాదికి దేశ రాజధాని డిల్లీలోనే కొందరు విద్యార్ధులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులపై కేసులు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నిన్న దృవీకరించారు. “జె.ఎన్.టి.యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ మద్దతు ఉంది. ఆతని ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు మావద్ద ఆధారాలున్నాయి. విద్యార్ధులే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం చాలా దురదృష్టకరం. హఫీజ్ సయీద్ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహించిన విద్యార్ధులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని నేను ఆదేశాలు జారీ చేసాను. దీనితో సంబంధంలేని విద్యార్ధుల జోలికి వెళ్ళవద్దని అధికారులను గట్టిగా హెచ్చరించాను. దేశ ప్రజలందరూ దేశ వ్యతిరేక కార్యక్రమాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కన్నయ్య కుమార్ తో బాటు కొందరు విద్యార్ధులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసారు. వామపక్షాల నేతలు కొందరు హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలిసి విద్యార్ధులను విడిచిపెట్టాలని కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న వారిని వెనకేసుకొని రావద్దని వారికి హితవు పలికారు. ఆ విద్యార్ధుల సంగతి న్యాయస్థానాలు చూసుకొంటాయని, ఈ వ్యవహారంలో ఇక తను జోక్యం చేసుకొన్ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, వామ పక్షాలు విద్యార్ధులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి జె.ఎన్.టి.యూనివర్సిటీకి వెళ్లి విద్యార్ధులకు సంఘీభావం తెలపడాన్ని రాజ్ నాద్ సింగ్ తప్పు పట్టారు. “దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారికి రాహుల్ గాంధి సంఘీభావం తెలుపుతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగ్రవాదుల విగ్రహాలు ఆవిష్కరించుకొంటే బాగుంటుందేమో?” అని ఎద్దేవా చేసారు. దేశ వ్యతిరేక చర్యలను గట్టిగా ఖండించకపోగా దానిని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని రాజ్ నాద్ సింగ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

మారువేషంలో జగన్ దగ్గరే జడ్జిలపై దూషణల కేసు నిందితుడు !

హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close