తమిళనాడు లో భాజపా కధ ‘కంచి’కేనా?

తమిళనాడు శాసనసభకి మే16న ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకే అమ్మ (జయలలిత)ని ప్రసన్నం చేసుకొని, ఆమె పార్టీ (అన్నాడిఎంకె)తో పొత్తులు పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడి చాలా ప్రయత్నించారు. కానీ అమ్మ కరుణించలేదు. ఆ రాష్ట్రంలో ఉన్న మరో ప్రధాన పార్టీ-డి.ఎం.కె. అప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఫిక్స్ అయిపోవడంతో, ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న మూడో ద్రవిడ పార్టీ-డి.ఎం.డి.కె.తో సర్దుకుపోవాలని భాజపా ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ అధినేత విజయ్ కాంత్ అచ్చం తన సినిమా స్టయిల్లో “నేను కింగ్ అవ్వాలనుకొంటున్నాను తప్ప కింగ్ మేకర్ కాదు. ఎన్నికలలో ఎవరితో పొత్తులు మాకవసరం లేదు. ఒంటి చేత్తోనే మా పార్టీని గెలిపించుకోగాలను,” అని పంచ్ డైలాగ్ కొట్టి భాజపాకి షాక్ ఇచ్చారు. అప్పటికీ తమతో చేతులు కలిపినట్లయితే ఆయననే తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని భాజపా నచ్చజెప్పాలని చూసింది కానీ విజయ్ కాంత్ అంగీకరించలేదు.

ఏదో ఒక పార్టీ ‘ద్రవిడ  స్టాంప్’ వేయించుకొంటే తప్ప ఎంత పెద్ద జాతీయపార్టీనయినా అక్కడి ప్రజలు పట్టించుకోరు. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా భాజపాకి ‘ద్రవిడ స్టాంప్’ అరువివ్వకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. వీటన్నిటికీ ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తున్న హీరో రజనీ కాంత్ ని కూడా ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడి గోకారు కానీ ఆయన యధాప్రకారం ఆకాశంవైపు చూపిస్తూ ఆ పైనున్న వాడి నుంచి ఇంకా ఆదేశం రాలేదంటూ తప్పించుకొన్నారు.

ఈ నేపధ్యంలో తమిళనాడులో భాజపా ఏవిధమయిన వ్యూహం అనుసరిస్తే కనీసం గౌరవ ప్రధమయిన సీట్లు సంపాదించుకోవచ్చును. రాష్ట్రంలో తమను ఒడ్డున పడేసే వేరే శక్తులు ఏమయినా ఉన్నాయా? లేకుంటే ఎన్నికలలో ఏవిధంగా ముందుకు సాగాలి? అనే విషయాలపై తన పార్టీ నేతలతో చర్చించేందుకు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవ్వాళ్ళ చెన్నై వెళుతున్నారు.

ఆయన ఇవ్వాళ్ళ సాయంత్రం చెన్నై చేరుకొని అక్కడి నుంచి నేరుగా కంచికి వెళ్లి కంచి కామకోటి పీఠాదిపతి స్వామీ జయేంద్రసరస్వతిని కలుస్తారు. ఆ తరువాతః పార్టీ నేతలని కలిసి మాట్లాడిన తరువాత కేరళ వెళతారని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్య రాజన్ తెలిపారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత పర్యటన తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తునది కాదని ఆమె తెలిపారు. అయితే చెన్నై నుండి ఎన్నికలు జరుగబోయే కేరళ రాష్ట్రానికి అమిత్ షా వెళుతున్నారు కనుక ఇది ఆయన వ్యక్తిగత పర్యటన కాదని స్పష్టం అవుతోంది.

జయలలిత భాజపాని కాదన్న తరువాత ఆమె  తీవ్రంగా వ్యతిరేకించే స్వామి జయేంద్రసరస్వతిని పనిగట్టుకొని అమిత్ షా ఎందుకు కలుస్తున్నట్లు? ఆయన ద్వారా రాష్ట్రంలోని వేరెవారినయినా (రజనీ కాంత్) ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమయినప్పటికీ తమిళనాడులో ఎన్నికలకు ముందే భాజపాకి పూర్తి వ్యతిరేక వాతావరణం ఏర్పడిందని తప్పక చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ కిచ్చిన హామీలన్నిటినీ ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చి ఉండి ఉంటే, తమిళనాడులో పార్టీలు, ప్రజలు కూడా భాజపాని విశ్వసించేవారేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close