అసెంబ్లీలో రాజాసింగ్ మాట్లాడకపోతేనే మంచిదని బీజేపీ అనుకుంటోందా.. ?

ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ గొంతు వినిపించదు. ఎందుకంటే.. ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్.. సమావేశాలకు వెళ్లకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే… అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడాలో ఆయనకు క్లారిటీ లేకుండా పోయింది. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి ఆయన రెండు లేఖలు రాశారు. అసెంబ్లీలో పార్టీ తరుపున ఏయే అంశాలను లేవనెత్తాలో తెలపాలని ఓ లేఖ, అసెంబ్లీ సమావేశాల సమయంలో తనకు వివిధ అంశాలపై సమాచారం ఇవ్వటానికి పార్టీ తరుపున సహాయకుడిని ఇవ్వాలని మరో లేఖ రాశారు. అయితే ఆయన లేఖలను బీజేపీ తెలంగాణ నాయకత్వం పట్టించుకోలేదు.

పార్టీ నుంచి సహకారం లేకపోవడంతకో అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానని చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ సర్కార్ ఫెయిలయిందని… ఆ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రాజాసింగ్ రెడీ అయ్యారు. అయితే తన ఉత్సాహంపై తన పార్టీ నాయకత్వం నీళ్ళు చల్లింది. తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు పార్టీ సహకరించకపోతే.. తాను కూడా పార్టీ నాయకత్వానికి సహకరించనని రాజాసింగ్ నిర్ణయించుకున్నారు. రాజాసింగ్ వివాదాస్పద మాటతీరు ఉన్నవ్యక్తి. అసెంబ్లీలో లేనిపోనివి మాట్లాడి కొత్త సమస్యలు తెస్తారని అనుకున్నారేమో కానీ… రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్లే బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎవరున్నా రాజాసింగ్‌కు పడదు. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తోనూ సరిపడలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. కొద్ది రోజుల కిందట.. పార్టీ రాష్ట్ర కమిటీలో తను సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని బండి సంజయ్ పై మండిపడ్డారు. బండి‌ సంజయ్ తో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు. దాంతో… అంతో ఇంతో ఉండే సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close