చెక్కేసినా చెదరని శిల్పాల వివాదం..!

చర్చి, మసీదుల్లోనూ కేసీఆర్ తన బొమ్మలు చెక్కించుకోగలరా..?హిందూమతంపైనే ఎందుకు దాడి చేస్తున్నారు..? అంటూ.. భారతీయ జనతా పార్టీ నేతలు… టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. యాదాద్రి ఆలయంలో.. కేసీఆర్ తో పాటు.. టీఆర్ఎస్ గుర్తు, ప్రభుత్వ పథకాల పేర్లు ఉండటాన్ని బీజేపీ.. హిందూ మతంపై .. జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తోంది. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతూండటంతో… ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నిన్న వివరణ ఇచ్చిన వైటీడీఏ చైర్మన్, స్థపతి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. సూచనల మేరకు శిల్పులు… కొన్ని చెక్కుడు కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శిల్పాల్లో.. కొంత మేర చెక్కేశారు. పేర్లను తొలగించారు. అయితే.. గుర్తులు మాత్రం అంతే ఉన్నాయి.

కేసీఆర్ బొమ్మ జోలికి వెళ్లలేదు. మరో వైపు సీఎంవో కూడా.. యాదాద్రి స్తంభాల్లో ఉన్న బొమ్మల వివాదంపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ నేతలు… పలువురు.. యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్… ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఆలయానికి వెళ్లి.. మొత్తం పరిశీలించిన ఆయన వారం లో… రాజకీయ పరంగా ఉన్న బొమ్మలంటినీ.. తొలగించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను పిలిపించి.. ఉద్యమం చేస్తామని ప్రకటించారు.

మరో వైపు… బీజేపీ, టీడీపీ నేతలు కూడా.. ఈ అంశంపై … ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. వీలైనంత త్వరగా.. ఈ వివాదాన్ని ముగించాలని… తెలంగాణ సర్కార్ కూడా ప్రయత్నిస్తోంది. వివాదాస్పద బొమ్మలును తొలగించాలనే… అంతర్గత ఆదేశాలు మౌఖికంగా వెళ్లాయని చెబుతున్నారు. అయితే…అసలు ఎవరు చెక్కమని చెప్పారు..? శిల్పులు ఎందుకు చెక్కారు..? అనే వివరాలు తెలుసుకుని.. చర్యలు తీసుకోవాల్సిందేనని..పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close