క్రాక్‌పై బాలీవుడ్ దృష్టి

తెలుగులో ఓ మంచి సినిమా వ‌స్తే చాలు.. రీమేక్ రైట్స్ ఎగ‌రేసుకుపోవ‌డానికి బాలీవుడ్ రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతోంది. యావ‌రేజ్ సినిమానీ వ‌ద‌ల‌డం లేదు. అర్జున్ రెడ్డి రీమేక్ హిట్ట‌యిన త‌ర‌వాత‌… ఆ జోరు మ‌రింత ఎక్కువైంది. `జెర్సీ` బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇప్పుడు వాళ్ల దృష్టి `క్రాక్‌`పై ప‌డింది. ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిపోయిన సినిమా `క్రాక్‌`. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవ్వ‌డానికి రెడీ అవుతోంది.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఇప్ప‌టికే కొంత‌మంది బాలీవుడ్ నిర్మాత‌లు.. ఠాగూర్ మ‌ధుని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. గోపీచంద్ మ‌లినేని మాత్రం `ఈ సినిమాని బాలీవుడ్ లోనూ నేనే తీస్తా` అంటున్నాడ‌ట‌. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్ అక్ష‌య్ కుమార్‌కి బాగా స‌రిపోతుంది. ఇక్క‌డి `విక్ర‌మార్కుడు`ని అక్ష‌య్ నే రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. ఈసారీ.. `క్రాక్‌`లో హీరో త‌నే కావొచ్చు. ఏ భాష‌లో వ‌చ్చినా.. పోలీస్ క‌థ‌ల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌లిచే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. `క్రాక్‌` ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. గోపీచంద్ మ‌లినేని ష‌ర‌తుకు.. నిర్మాత‌లు ఓకే అంటే.. అతి త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసే ఛాన్స్ వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close