తెలంగాణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అమలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి రిజర్వేషన్లు 60 శాతానికి చేరుతాయి. రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ అవుతాయని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. గత ఎన్నికలకు ముందు.. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల్లో అమలు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

బీజేపీ పాలిత రాష్ట్రాలు వీటిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుని అమలు చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పది శాతంలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. మిగిలిన ఐదు శాతం ఇతర కులాల అగ్రవర్ణాలకు కేటాయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాగానే.. ఆ ఐదు శాతం రద్దు చేశారు. అదే సమయంలో… పది శాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ అసలు ఎప్పుడూ అమలు చేయాలని అనుకోలేదు. కేంద్ర పథకాలేమీ అమలు చేయడం లేదు.

ఈ అంశంపై బీజేపీ నేతలు విమర్శలు కూడా చేసేవారు. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. కేంద్రం పథకాలను అన్నింటినీ అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. వద్దే వద్దని ప్రకటించిన ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నారు. కేసీఆర్ నిర్ణయం సంచలనాత్మకం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close