బొత్స అమరావతి పరిశీలన.. ఫర్ సేల్ బోర్డు పెట్టడానికా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవలి కాలంలో అమరావతి విషయంలో కాస్తంత స్పందన కనిపిస్తోంది. చివరి దశకు వచ్చిన భవనాలనుపూర్తి చేయాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలొచ్చాయని మీడియాలో ప్రచారం జరిగింది. అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ వస్తానని అధికారులకు చెప్పారు. ఈ హడావుడి చూసి.. అమరావతి విషయంలో మనసు మార్చుకున్నారేమో అని చాలా మంది అనుకోవడం ప్రారంభించారు. కానీ.. ఇప్పుడిప్పుడే సీఆర్డీఏ వర్గాలు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నాయి. ఏమింటంటే.. అక్కడ నిర్మించిన భవనాలను అమ్మేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట.

ఆ టవర్లన్నీ అమ్మే సన్నాహాల్లోనే బొత్స పర్యటన..!?

అమరావతిలో గత ప్రభుత్వం మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాల కోసం భారీ రెసిడెన్షియల్‌ టవర్లను నిర్మించింది. ఒక్కొక్కటి 12 అంతస్తులతో కూడిన సుమారు 63 రెసిడెన్షియల్‌ టవర్లు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. వీటన్నింట్లో కలిపి సుమారు 4,200లకుపైగా ఫ్లాట్లు ఉంటాయి. మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్‌ అఖిల భారత సర్వీస్‌ అధికారుల కోసం 180 బంగళాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వీటిలో అత్యధికం 80 శాతంమేర పూర్తయ్యాయి. ఏడాది నుంచి పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడే ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోంది.

తక్కువ ధరకైనా తెగనమ్మాలనే సీఆర్డీఏకి సూచనలు.. !

రాజధాని భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు… కట్టిన టవర్లను పూర్తి చేసి.. రియల్ ఎస్టేట్ తరహాలో అమ్మేడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని సీఆర్డీఏ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. భవనాల పూర్తికి ఇంకెంత ఖర్చు అవుతుంది.. అమ్మేస్తే ఎంత ఆదాయం వస్తుందో.. సీఆర్డీఏ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మూడు వేల కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్ ధర కన్నా… 20 శాతం తక్కువ ధర నిర్ణయిస్తే.. డిమాండ్ బాగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

హ్యాపీనెస్ట్ కొన్నవాళ్లే వద్దంటున్నారు.. కొత్త వారు కొంటారా..?

ఇప్పటికే అమరావతిలో… ప్రజల కోసం హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్‌ను సీఆర్డీఏ చేపట్టింది. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు అన్నీ ప్రాజెక్ట్ ప్రారంభించిన రోజునే అయిపోయాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ కొనుగోలు దారుల్లో ఒక్కంటే.. ఒక్కరు కూడా.. తమకు ఇప్పుడు ఫ్లాట్ కావాలని అడగడం లేదు. ప్రభుత్వం రాజధానిని మార్చాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ.. ఏపీ సర్కార్ ఆ ప్రాజెక్టుకూ రివర్స్ టెండర్లు పిలిచింది. డబ్బులు కట్టిన వాళ్లే అక్కడ వద్దని వెనక్కి పోతూంటే… కొత్తగా డిమాండ్ వస్తుందని ప్రభుత్వం మాత్రం ఆశల పల్లకీలో ఉంది. అయితే.. ఓ రాజధాని కోసం .. కట్టిన ప్రభుత్వ ఆస్తుల్ని ఇలా అమ్మేయాలనే ఆలోచన నిజం అయితే మాత్రం.. ఓ మిరకిలే అవతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close