జగన్‌పై బొత్స అసంతృప్తి..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో… లుకలుకలు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతలకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేవ్‌లెంగ్త్ కుదరడం లేదని.. సెక్రటేరియట్‌లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… దీనికి సంబంధించిన మొదటి సూచన… బయటపడింది. సీఆర్డీఏ పై.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశానికి.. పురపాలక మంత్రి… బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై… జగన్ ఆరా తీశారు. గత సమీక్షలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం డుమ్మాకొట్టారు.

అమరావతి విషయంలో .. బొత్స చేస్తున్న ప్రకటనలు.. జగన్మోహన్ రెడ్డిని ఆగ్రహానికి గురి చేశాయని చెబుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బొత్స.. అమరావతి ఆగదని.. నిర్మాణాలు కొనసాగుతాయని చెబుతున్నారు. అయితే.. ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధం. దీనిపై… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఓ సారి.. బొత్సను పిలిపించి క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయాలను మాత్రమే మీడియా ముందు ప్రకటించాలని.. ప్రభుత్వంలో ఎలాంటి చర్చ జరగకుండా… అమరావతి నిర్మాణం కొనసాగుతుందని ఎలా ప్రకటిస్తారని.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో.. బొత్స షాక్‌కు గురయ్యారని చెబుతున్నారు.

సీనియర్ మంత్రిగా.. తనకు ఏ మాత్రం స్వేచ్చ ఇవ్వడం లేదని… ఆయన భావిస్తున్నట్లుగా… ఆయన మంత్రిత్వ శాఖలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అమరావతి విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ఇక ఒక్క ఇటుక కూడా అక్కడ పడకూడదన్నదే ఆ క్లారిటీ. అయితే… దీన్ని అర్థం చేసుకోకుండా బొత్స ప్రకటనలు చేయడంతో… జగన్ కు ఆగ్రహం వచ్చింది. అందుకే.. సీఆర్డీఏ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లుగా.. బొత్స వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close