బొత్సకు అమరావతి రైతులు – విజయనగరం రైతులు వేర్వేరు !

చెరుకు పంట బకాయిలు చెల్లించలేదన్న ఆందోళనలపై ఉక్కుపాదం మోపాలనుకున్న పోలీసులను సొంత జిల్లా రైతులు తిరగబడి కొట్టడంలో తప్పు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. అదే సమయంలో వేల ఎకరాల భూములు రాజధానికి మోసపోయి .. రోడ్డున పడ్డ అమరావతి రైతుల్ని మాత్రం ఆయన రైతులుగా గుర్తించడానికి సిద్ధపడటంలేదు. వారు రైతులు కాదంటున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో రైతులు లేరని టీడీపీ నేతలే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చేశారు. అమరావతి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా మేలు చేస్తోందని కౌలు కూడా చెల్లించామని చెప్పారు. అయినా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని .. అంత అవసరం ఏముందని.. అందుకే అది టీడీపీ యాత్ర అంటున్నానని చెప్పుకొచ్చారు.

బొత్స సత్యనారాయణ అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొదటి నుంచి ముందు ఉన్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో తమ పార్టీ తరపున కుక్కను నిలబెట్టినా గెలుస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రైతులను గుర్తించడానికి కూడా ఆయన సిద్ధపడటం లేదు. అదే సమయంలో సొంత జిల్లాలో చెరుకు రైతులు ప్రైవేటు కంపెనీ బకాయిలు చెల్లించలేదని ఇటీవల ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులపైనే దాడి చేశారు. కొబ్బరి మట్టలతో పోలీసులను తరిమికొట్టారు. ఈ ఘటనను బొత్స సత్యనారాయణ సమర్థించారు.

రైతులు తిరగబడటంలో తప్పులేదని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ భూములు అమ్మి అయినా సరే రైతుల బకాయిలు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. రైతులు తొందరపడి మాట్లాడొద్దని.. రాళ్లతో పోలీసులపై దాడి చేసినా వాళ్లు సంయమనం పాటించారన్నారు. అయితే రైతులు తిరగబడటం వెనుక టీడీపీ నేతలున్నారని ఆరోపించారు. తన జిల్లాలో ప్రైవేటు కంపెనీ విషయంలో పోలీసుల తీరును రైతులు ఖండించి తిరగబడితే… సమర్థించిన బొత్స .. అదే వేల ఎకరాల భూమి ఇచ్చి అన్యాయమైపోయిన రైతులు పాదయాత్ర చేస్తూంటే మాత్రం వారిని దారుణంగా కించ పరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close