కిడ్నాప్ కేసులో నిందితుల్ని కావాలనే పట్టుకోవడం లేదా..!?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ఎక్కడెక్కడి వారినో.. వల వేసి గోవాలాంటి చోట్లకు వెళ్లి మరీ పట్టుకుంటున్నారు కానీ.. కీలక నిందితులుగా చెబుతున్న భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్, భార్గవరామ్ తల్లి, సోదరుడులను మాత్రం పట్టుకోవడం లేదు. వీరిలో కేసు బయటకు వచ్చిన తర్వాత జగత్ విఖ్యాత్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన డ్రైవర్‌ను పట్టుకోవడం ద్వారా జగత్ విఖ్యాత్ పాత్ర గురించి బయటకు వచ్చిందని పోలీసులు లీక్ చేసి ఆయన కోసం వెదుకుతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. తాజాగా.. భార్గవరామ్ తల్లి, పది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. వారి కోసమూ వెదుకుతున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. భార్గవరామ్, గుంటూరు శ్రీనుల గురించి దేశం మొత్తం గాలిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందర్నీ పట్టుకుంటున్న పోలీసులు వీరినెందుకు పట్టుకోవడం లేదన్న అనుమానం… సామాన్యుల్లో వస్తోంది.

సాధారణంగా నిందితులందరూ దొరికితే.. అప్పటికే అరెస్టయిన వారికి బెయిల్ వస్తుంది. అఖిలప్రియకు బెయిల్ రాకూడదన్న ఉద్దేశంతోనే… ఇలా కీలక నిందితుల్ని అరెస్ట్ చేయడం లేదని.. ఇంకా కీలకమై నిందితుల్ని పట్టుకోలేదన్న కారణం చెబుతూ.. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయాలని లాయర్లు వాదిస్తారని చెబుతున్నారు. గతంతో.. ఏపీలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని కొంత మంది గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అలాగే అరెస్ట్ చేసి.. ప్రమోద్ రెడ్డి అనే ఏ -3 నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆ కారణం చూపి.. ఆయనను రెండున్నర నెలల పాటు జైల్లో ఉంచారు. చివరికి న్యాయస్థానం ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారని ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా అదే వ్యూహంతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం భూ వివాదం సెటిల్మెంట్ కోసం కూడా ఈ కేసును వాడుకుంటున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. భూమా వారసులు ముగ్గురూ చిన్న వాళ్లే కావడంతో వారిని సులువుగా కేసుల భయంతో హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. అందుకే.. కేసులో ఒక్క కిడ్నాప్ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కుటుంబంలో అందర్నీ కేసుల్లో ఇరికిస్తామన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. అదే సమయంలో అసలు భూ వివాదం ఏమిటి.. ఆ భూములపై ఎవరికి హక్కులున్నాయన్న అంశం జోలికి మాత్రం పోలీసులు పోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close