ఈ వారం సినిమాలు: బాలయ్యపైనే ఆశలు

గత మూడు వారాలుగా సరైన సినిమాలేక టాలీవుడ్ బాక్సాఫీసు డీలా పడింది. అయితే ఈ వారం ఆ లోటు తీరిపోయినట్లే కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలయ్య- బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇందులో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. అఘోరగా బాలకృష్ణ.. ట్రైలర్ లో స్టన్నింగ్ గా వున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. ‘అఖండ’విజయంతో పండక్కి బాలయ్య ఘనస్వాగతం పలుకుతారానే అంచనాలు వున్నాయి.

అఖండతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్ లో వున్నాయి. సత్యదేవ్‌, నిత్యమేనన్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. ఈ సినిమా కూడా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1979 నేపథ్యంలో సాగే చిత్రమిది. అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్‌ ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడతుందనే అనుమానాలు, దాని చుట్టూ హాస్యంతో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నిత్యా, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ లాంటి నటులు వుండటం సినిమాపై పాజిటివిటీని పెంచుతుంది. స్కైలాబ్‌ తో పాటు పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాక్‌ డోర్‌’ సినిమా కూడా డిసెంబరు 3 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ లో కూడా పూర్ణ తప్ప మరెవరూ కనిపించలేదు.

ఈ రెండితో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా విడుదలకు సిద్దమైయింది. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని 2020లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనాతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఎట్టకేలకు డిసెంబరు 3న థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌ లాంటి భారీ తారాగణం వుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ చూస్తుంటే థియేటర్ ఎక్స్ పిరియన్స్ వున్న సినిమాగా అనిపిస్తుంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా మాత్రం బాలయ్య అఖండనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close