తొక్కిసలాట ఘటనలో ‘బోయపాటి’ కోణం

హైదరాబాద్: రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనలో నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ గురించి నిన్న, మొన్న గొడవ జరిగాక ఇవాళ కొత్త కోణం వెలుగులోకొచ్చింది. బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను తీసిన బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డాక్యుమెంటరీ తీస్తుండటంవల్లే ఈ దుర్ఘటన జరిగిందని కాంగ్రెస్, వైసీపీ ఇవాళ ఆరోపణలు ప్రారంభించాయి. పుష్కరాలలో చంద్రబాబు స్నానాలు, పూజల దృశ్యాలను బోయపాటితో షూటింగ్ చేయిస్తున్నారని, అందుకే మూడుగంటల సమయం పట్టిందని ఏపీ పీసీీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనివలనే దుర్ఘటన జరిగిందని, చంద్రబాబుపై 302 సెక్షన్ కింద కేసుపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీకూడా ఇదే వాదనను అందిపుచ్చుకుని టీడీపీపై దాడిని ప్రారంభం చేసింది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిపారని, అందువల్లే దుర్ఘటన జరిగిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

బోయపాటి రాజమండ్రిలో చంద్రబాబువెంట ఉన్నది మాత్రం నిజం. చంద్రబాబు పక్కనే ఉండి మైక్‌లో సూచనలు ఇస్తున్న బోయపాటి ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో రౌండ్‌లు కొడుతోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ ఫోటో రాత్రి సమయంలో తీసినట్లు స్పష్టంగా కనబడుతోంది. దుర్ఘటన జరిగింది ఉదయం అన్నది అందరికీ తెలిసిన విషయమే. జరిగిందేమిటంటే, వారణాసిలో కుంభమేళా సందర్భంగా గంగా నదివద్ద ఇచ్చే హారతి స్థాయిలోనే రాజమండ్రిలో గోదావరికి హారతి ఇచ్చే కార్యక్రమాన్ని జరపాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. మొదటిరోజు నిర్వహించిన పుష్కర నిత్యహారతికి అనుకున్నంత స్పందన రాకపోవటంతో దీనిని మెరుగుపరిచే బాధ్యతను బాబు బోయపాటికి అప్పగించారు. బోయపాటి రెండువంతెనల నడుమ ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ పంటుమీద ఒక వేదికను ఏర్పాటుచేసి గుంటూరుకు చెందిన కళాదర్శకులతో వేదికను నిర్మింపజేశారు. అక్కడ ఈనెల 13నుంచి నిత్యహారతి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఆ ఏర్పాట్ల ఫోటోయే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. అంతేగానీ బోయపాటి ఏ విధమైన డాక్యుమెంటరీ తీయలేదని స్థానికులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close