“బ్రహ్మం గారి మఠం” వారసత్వ వివాదాన్ని పెంచుతోందెవరు..?

బ్రహ్మంగారి మఠం వారసత్వం విషయంలో ఏర్పడిన వివాదంలో ప్రభుత్వం సమస్యను పరిష్కరించకబోగా… రెండు వర్గాల మధ్య మరింత గొడవలు ముదిరేలా చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణం ఏదో ఓ నిర్ణయం తీసుకుని.. ఒకరికి సర్దిచెప్పి.. మఠం నిబంధనల ప్రకారం..మరొకరికి బాధ్యతలు ఇచ్చి ఉంటే.. సమస్య ఉండేది కాదు. కానీ కమిటీలు అని నాన్చి నాన్చి… మఠాధిపతుల్ని మధ్యవర్తిత్వానికి పంపి… సమస్యను పీటముడి పడేలా చేశారు. ఇప్పుడు మఠం నిర్వహణకు ప్రభుత్వం కడప అసిస్టెంట్ కమిషనర్‌ను క్విక్‌ పర్సన్‌గా నియమించింది. ఈ అంశంపై మంత్రి వెల్లంప్లలి స్పందన మరిన్ని సందేహాలు లేవెనత్తుతోంది. మఠాధిపతిపై ధార్మిక పరిషత్‌ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని.. 30 రోజుల ముందు నోటీసులు ఇచ్చి అందరితో చర్చిస్తామని చెప్పుకొచ్చారు.

128 మఠాలలోని సభ్యులతో కమిటీ వేస్తామని కూడా వెల్లడించారు. అంటే వివాదాన్ని ఇప్పుడల్లా పరిష్కరించే పరిస్థితి లేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు.

బ్రహ్మంగారి మఠ పీఠాధిపతిగా ఉన్న వీరబోగ వసంత వేంకటేశ్వరస్వామి అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరి భార్యలకూ మగ పిల్లలు ఉన్నారు. ఆయన చినన భార్య కుమారుడికి తన తదనంతరం మఠాధిపతి పదవి దక్కాలని వీలునామా రాశారు. కానీ.. సంప్రదాయం ప్రకారం.. తమ కుమారుడికే పదవి ఇవ్వాలని పెద్ద భార్య పట్టుబడుతున్నారు. అక్కడేవివాదం పీటముడి పడిపోయింది. ఈ వివాదం పరిష్కరించేందుకు ఇటీవల 12 మంది శైవక్షేత్ర పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకొని ఇరు కుటుంబాల మధ్య సయోద్యకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

మరోవైపు.. చనిపోయిన పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి ప్రాణానికి హాని ఉందంటూ డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి అసాంఘిక శక్తులతో చేతులు కలిపి.. తమ కుటుంబపై తరచూ దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు పీఠాధిపతులు మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామికి మద్దతుగా కుట్ర పన్నుతున్నారని రెండో భార్య ఆరోపించారు. పి తమ కుటుంబానికి పీఠం దక్కకుండా చేసి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

నిజానికి ఈ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించి.. పవిత్రమైన మఠాన్ని.. అంతే పవిత్రంగా ఉంచేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కారణం ఏమిటో కానీ.. వివాదం పెరిగి పెద్దదయ్యేలా చూస్తూ ఉండటమే కాదు.. ఇ్పపుడు… ఇప్పుడల్లా పరిష్కారం కాదని చెబుతున్నట్లుగా వందల మందితో కమిటీలు.. చర్చలకు నెల రోజులకు ముందుగా నోటీసులుఇస్తామని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close