ఈటల ఎపిసోడ్‌లో ఎక్కడా నోరెత్తని కేటీఆర్..! వ్యూహమా..?

తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. అటు ప్రభుత్వంలో యాక్టింగ్ సీఎంగా ఉంటారు. అన్ని శాఖల్లోనూ ఆయన చొరవ తీసుకుంటూ ప్రకటనలు..నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు. పార్టీలోనూ అంతే. ఆయన అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్. అందుకే అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం ఉంటుంది. కానీ ఎందుకనో కానీ.. ఒక్క విషయంలో మాత్రం.. ఆయన సైలెన్స్ పాటిస్తున్నారు. ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ఆ విషయమే.. ఈటల రాజేందర్ ఇష్యూ. ఈటల రాజేందర్ అంశం .. తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం రేపుతోంది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు ప్రారంభించిన దగ్గర్నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకూ.. చాలా చాలా ఆరోపణలు చేశారు.

అయితే.. ఏ ఒక్క సారి కూడా ఆయన స్పందించలేదు. నిజానికి మొదటి సారి ఈటల ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన మొదట హోమ్ ఐసోలేషన్‌లో తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారు. ఆ సమయంలో తన ట్విట్టర్ ఖాతాను కూడా.. సైలెంట్ మోడ్‌లోనే ఉంచారు కేటీఆర్. కోలుకుని మళ్లీ అధికార విధుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈటల అంశంపై స్పందించడం లేదు. ఇప్పుడు ఈటల ఇష్యూ క్లైమాక్స్ కూడా అయిపోయింది.

ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. సోమవారం బీజేపీలో చేరుతున్నారు. అయినా కేసీఆర్ సైలెన్స్‌గానే ఉన్నారు. ఇదంతా.. కేసీఆర్ వ్యూహమని.. ఈ వివాదంలోకి అసలు కేటీఆర్ అనే పేరు రాకుండా చూడాలని ఆయన అనుకున్నారు. ఒక వేళ అలా వస్తే.. కుమారుడి కోసమే ఈటలను పంపేసతున్నారన్న ప్రచారం జరుగుతుందని.. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా కేటీఆర్‌తో ఈటల అంశంపై మాట్లాడించడం లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close