అధికారం కోల్పోయాక మళ్లీ సెంటిమెంట్ రగుల్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. సీఎం రేవంత్ ను చంద్రబాబు ప్రతినిధిగా చూపే ప్రయత్నం చేసినా అదీ వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ ఉనికే సెంటిమెంట్ పై ఆధారపడి ఉండటంతో.. మళ్లీ అందుకోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు బనకచర్లను అందుకు ఉపయోగించుకుంటోంది.
బనకచర్లను వివాదాస్పద ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు హరీష్ రావు బాధ్యత తీసుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన హరీష్.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పలేకపోయారు.
ఆదివారం ఇదే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. అయితే, బీఆర్ఎస్ చేస్తోన్న రాజకీయంలో అసలు కుట్రను పసిగట్టడంలో మంత్రి ఉత్తమ్ కూడా ఫెయిల్ అవుతున్నారు. అసలు ఆ ప్రాజెక్టుతో ఎలాంటి నష్టమో హరీష్ రావు చెప్పకపోయినా, ఉత్తమ్ సైతం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ, ఉత్తమ్ అయినా దీనిపై క్లారిటీ ఇచ్చారా అంటే అదీ లేదు.
దీంతో.. మళ్లీ ఆంధ్ర – తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చాలని బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర రాజకీయాల ట్రాప్ లో ఉత్తమ్ చిక్కుకున్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది.