అప్పుడే సెకండ్ వేవ్‌ కట్టడిలో ఏపీ నెంబర్ వన్నట.. !

కరోనా రెండో దశపై ఇంకా పోరాటమే ప్రారంభమే కాదు… తాము గెలిచేశామని ఏపీ మంత్రులు డబ్బా పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో వైరస్‌ అంశంపై సమీక్షా సమావేశం పెట్టి… ఎప్పుడూ ఇచ్చే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందని ప్రకటించుకున్నారు. ఏపీ ఏ విధంగా ముందంజలో ఉందో కానీ.. మంత్రి మాత్రం.. తాము గొప్పగా పని చేశామని చెప్పుకోవడానికి ప్రాదాన్యం ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది.

ఉన్న పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు యాభై శాతం ఉందని.. స్వయంగా మంత్రి గౌతం రెడ్డి ప్రకటించారు. అంటే పరిస్థితి డేంజర్ స్టేజ్‌ను కూడా దాటిపోయిందన్నమాట. అయినప్పటికీ.. దేశమంతా తమ వైపు చూసేలా.. కరోనాను కట్టడి చేస్తున్నామని మంత్రి బుగ్గన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. గతంలోనూ కరోనా కట్టడి కన్నా.. కట్టడి చేశామని పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని… అందుకే చివరికి తెలంగాణ కన్నా ఎక్కువ మరణాలు. .ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది.

పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నప్పటికీ.. కనీస పాటి ఆంక్షలు కూడా పెట్టలేదు. వ్యాక్సిన్ విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. అయినా సరే కట్టడిలో దేశంలో ముందంజలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం కాక ముందే గెలిచేశామని గప్పాలు కొట్టుకోవడం అంటే ఏమిటో ఏపీ మంత్రులు నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close