ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి …కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి కొంత ఆర్థిక సాయం అవసరం అని గుర్తించి హుటాహుటిన అయన ప్రత్యేక బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఆర్థిక మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… ప్రత్యేక పంథా ఎంచుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా పెద్ద బుట్ట తీసుకెళ్లి.. అందులో శ్రీవారి విగ్రహం.. ప్రసాదాలు.. ఇతర శ్రీవారి పవిత్రమైన వస్తువులు ఉంచారు. ఎప్పుడూ లేని విధంగా.. అనేక వస్తువులు.. ఆ బుట్టలో ఉండటంతో.. నిర్మలా సీతారామన్ కూడా.. వాటిని ఆసక్తిగా చూడటం.. మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో కనిపించింది. ఆ మాత్రం బుట్టకే కేంద్ర ఆర్థిక మంత్రి బుట్టలో పడిపోయి.. నిధులు ఇచ్చేస్తారా అన్న చర్చ ఢిల్లీలో ప్రారంభమయింది.

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయంతో సంబందం లేకుండా.. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ అప్పులు సేకరించి.. పథకాల పేరుతో పంపిణీ చేస్తున్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. అదే సమయంలో… తీసుకుంటున్న అప్పులకు సంబంధించి… చెల్లించాల్సిన వాయిదాల మొత్తం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి పెంచడంతో… ఎలా చెల్లించాలన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం… ఆ ఆప్పును వరుసగా తీసుకుంటోంది. రాష్ట్ర విభజన నాటితో పోలిస్తే.. ఇప్పుడు లోటు మరింత పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. నెలాఖరుకు అప్పులు తీసుకోకపోతే.. జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినట్లు.. ఈ నెల తేలిపోయింది. దీంతో.. తక్షణం ప్రభుత్వం నడవడానికి ఎంతో కొంత సాయం కావాల్సిన పరిస్థితి ఉంది.

నిజానికి ఏపీకి.. నెల వారీగా కేంద్రం నుంచి దండిగా నిధులు అందుతున్నాయి. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు.. పన్నుల వాటా కాకుండా.. నెలకు రూ. ఐదు వందల కోట్లు వస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల కోసం… ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు వస్తున్నాయి. కోవిడ్ నియంత్రమ కోసం.. కేంద్రం ఇస్తున్న నిధులూ వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణకు.. ఏపీకి వస్తున్న నిధుల్లో.. 30 శాతం కూడా రావడం లేదు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ అనుత్పాదక వ్యయం ఎక్కువ చేస్తూండటంతో.. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటినీ… ప్రసాదం బుట్టతో అధిగమించాలని.. బుగ్గన ప్రయత్నిస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close