సంచలనం సృష్టిస్తోన్న రామోజీ భేటీలు: మొన్న జగన్, ఇవాళ దిగ్విజయ్

హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తన భేటీలతో సంచలనం సృష్టిస్తున్నారు. గత నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ కాగా, నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. దిగ్విజయ్ నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళారు. వీరు ముగ్గురే కొంతసేపు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత, ఇతర ముఖ్యమైన అంశాలేమీ లేవని, కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీరావును కలిసినట్లు దిగ్విజయ్ మీడియాకు వెల్లడించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు వరసగా రామోజీని కలవటం వెనక ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. వారు ఏదో ప్రయోజనాలను ఆశించే రామోజీతో భేటీ అవుతున్నారనేది స్పష్టమేగానీ ఆ ప్రయోజనమేమిటనేది ఇదమిత్థంగా తెలియంటలేదు. జగన్‌తో భేటీ కాగానే చంద్రబాబునాయుడుతో సంబంధాలు చెడిపోయాయని, అందుకే జగన్‌తో భేటీ అయ్యారనే ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే మొన్న చంద్రబాబు స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆహ్వానపత్రం ఇవ్వటంతో ఆ ఊహాగానాలు నిజంకాదని నిర్ధారణ అయింది. మరి తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండే రామోజీపై వైసీపీ, కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లుండి ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close