మండలి రద్దు చేస్తే మూడు రాజధానులు వెంటనే సాధ్యమా..?

శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యంకాదనే వాదన వినిపిస్తోంది. కేంద్రం.. సాయంతో.. ఉభయసభల్లో.. మండలి రద్దు బిల్లును ఆమోదింప చేసుకున్న తర్వాతనే సాంకేతికంగా మండలి రద్దు అవుతుంది. అప్పటి వరకూ… మండలి ఉనికిలోనే ఉంటుంది. సెలక్ట్ కమిటీపని చేస్తుంది. ఇప్పటికే.. మండలి చైర్మన్ షరీఫ్… సెలక్ట్ కమిటీ సభ్యుల నియామక ప్రక్రియను ప్రారంభించారు. అది నాలుగు నెలలా.. ఐదు నెలలా అనేది చెప్పలేము. మండలిని కేంద్రం సాయంతో రద్దు చేసినా … జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల్ని ముందుకు తీసుకెళ్లగలరా.. అంటే… న్యాయపరమైన వివాదాల గురించి.. ప్రధానంగా చర్చ వస్తుంది.

ఎందుకంటే.. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాల్ని… తుంగలో తొక్కిన విషయం స్పష్టంగా ఉంది. రాజధాని తరలింపు నిర్ణయాలను కోర్టు అడ్డుకోలేకపోవచ్చు కానీ..రైతులకు పరిహారం ఇవ్వాలని మాత్రం ఆదేశించవచ్చు. రైతులతోచేసుకున్న ఒప్పందం ప్రకారం.. వారు ఇచ్చిన భూములకుప పరిహారం ఇవ్వాలంటే.. రెండు నుంచి నాలుగు లక్షలకోట్ల వరకూ అవుతుంది. అంత సొమ్ము ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే.. కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని సార్లు కోర్టు మెట్టికాయలు వేసినా.. తాను అనుకున్నది చేస్తూనే ఉన్నారు. అవి మధ్యలో ఆగిపోయినా ఆయన పట్టించుకోవడం లేదు.

పోలవరం సహా.. అన్నీ.. ఇలా త్రిశంకుస్వర్గంలో ఉండిపోయాయి. ఎలా చూసినా.. మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి…చట్టాలను.. రాజ్యాంగాల్ని ఉల్లంఘించి తరలించాలి తప్ప.. న్యాయపరంగా..చట్టబద్ధంగా తరలించడానికి సాధ్యం కాదంటున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌లో ..కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close