ఏపీలోనే అవినాష్ రెడ్డి షెల్టర్ – సీబీఐ మళ్లీ నోటీసులు !

హైదరాబదా్, బెంగళూరు ఎక్కడైనా అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఎక్కువ బలం ఉంటుంది కానీ ఏపీలో అయితే.. స్థానిక పోలీసుల మద్దతు తనకే ఉంటుందన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలకే చెందిన కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో తల్లిని చికిత్స కోసం చేర్పించిన అవినాష్ రెడ్డి తాను కూడా లోపలే ఉండిపోయారు. ఆ చుట్టుపక్కల మీడియాను రానివ్వడం లేదు. పులివెదుల నుంచి వచ్చిన అవినాష్ అనుచురులు విశ్వభారతి ఆస్పత్రిని..ఓ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నట్లుగా మార్చేశారు.

మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరో నోటీసు జారీ చేశారు. 22వ తేదీన ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే అవకాశం ఇప్పుడు సీబీఐ అధికారులకు లేదు. ఆయనను కర్నూలు వరకూ వెంబడించిన సీబీఐ అధికారులు నిన్ననే పరిస్థితుల్ని గమనించి కర్నూలు నుంచి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల్ని సంప్రదించి ఏం చేయాలా అని చర్చించి.. చివరికి మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తల్లికి అనారోగ్యమని చెప్పినందున మరో చాన్స్ ఇవ్వడం మంచిదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే అవినాష్ రెడ్డి మాత్రం సీబీఐ విచారణకు హాజరవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. అరెస్ట్ చేయరు అనే హామీ ఇస్తే మాత్రమే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇప్పటికే మూసుకుపోయాయి. సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పటికైనా చేస్తుంది. కానీ ఎందుకో ఆలోచిస్తోంది. నోటీసులు ఇస్తోంది. వెళ్తే అరెస్ట్ చేస్తారనే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం లేదు. తనకూ అనారోగ్యం అని అదే ఆస్పత్రిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

ఒక వేళ అరెస్ట్ చేయడానికి వస్తే సీబీఐ అధికారులకు స్థానిక పోలీసుల సహకారం లభించదు. స్థానిక పోలీసుల సాయం చేయకండా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు. ఈ వ్యవహాన్ని కొంత కాలం కంటిన్యూ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close