బీజేపీ సూపర్ సీనియర్లకు నిద్ర లేకుండా చేస్తున్న బాబ్రీ తీర్పు

1992 డిసెంబర్‌ 6న ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై లఖ్‌నవ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు …తీర్పు వెల్లడించనుంది. లిబర్హాన్‌ కమిషన్‌ 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2009లో నివేదిక ఇచ్చింది. మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా బీజేపీ సీనియర్‌ నేతలు ఆద్వానీ, మురళీ మనోహర్‌జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నేతలున్నారు. మసీదు కూల్చివేతకు నేర పూరిత కుట్ర పన్నారని అద్వానీతో పాటు పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదుఏసింది. 2001లో అద్వానీతో సహా ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పును అలహాబాద్‌ కోర్టు సమర్థించింది. అలహాబాద్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఓవర్‌రూల్‌ చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై నమోదైన నేరపూరిత కుట్ర అభియోగాలను రీస్టోర్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండేళ్లలో విచారణను పూర్తిచేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఆ గడువు ముగిశాక మరో నెలలు 9 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు కూడా గత నెలాఖరుకు ముగిసింది. అయితే మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. దీంతో సీబీఐ ప్రత్యేకకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. తుది తీర్పు సమయంలో.. నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలోనే ఆదేశించింది.

అయితే వయోభారం కారణం… కరోనా కారణంగా కోర్టు అనుమతిస్తే వాళ్లు ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు తీర్పు వింటారు. మసీదు కూల్చివేతపై నిందితులుగా పేర్కొన్న వారి వాదన మరోలా ఉంది. బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నేతలు అయోధ్య వెళ్లిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించామని అప్పుడు కొందరు ఆవేశంతో మసీదును కూల్చివేశారని వారు వాదిస్తున్నారు. నాయకులెవ్వరూ కరసేవకులను రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ఎవరి వాదన ఏమిటో.. బాబ్రీ కూల్చివేతకు కారకులు ఎవరో సీబీఐ కోర్టు తేల్చనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close