దస్తగిరి భద్రతపై సీబీఐ ప్రత్యేక దృష్టి !

వైెస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రెండు ప్రత్యేక సీబీఐ బృందాలు ప్రస్తుతం పులివెందులలోనే మకాం వేశాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ కొట్టి వేసిన వెంటనే హైదరాబాద్ నివాసం నుంచి వెళ్లిపోయిన అవినాష్ రెడ్డి మళ్లీ మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్నారు. ఆయన పరారయ్యారని అనుకుంటారమో కానీ పులివెందులకు వస్తారని ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రెండు సీబీఐ బృందాలు పులివెందులకు చేరుకున్నాయి.

ఆదివారమే సీబీఐ బృందం వైఎస్ వివేకా ఇంట్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా దగ్గర మరిన్ని వివరాలు తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ఇల్లు, వివేకా ఇంటిని పరిశీలించారు. టెక్నికల్ గా తమ దగ్గర ఉన్న ఆధారాలు నిజమేనని.. అవినాష్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని నిరూపించేలా కొన్ని సాంకేతిక అంశాలను సిద్ధం చేసుకున్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి కి ముప్పు ఉంటుందన్న భావనతో సీబీఐ అధికారులు ఆయనకు భరోసా కల్పించేందుకు ఇంటికి వెళ్రారు. భద్రతా పరంగా కొన్ని సచనలు చేశారు. ఏ చిన్న అనుమానం వచ్చిన తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

మరో వైపు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పై నిర్ణయం వెలువడలేదు. ఈ రోజు జరగాల్సిన విచారణ బుధవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాలేదని.. మధ్యాహ్నం విచారణ చేపట్టాలని.. న్యాయవాది కోరగా… జడ్జి అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ ఆలస్యంగా వచ్చినందున బుధవారం విచారణ చేపడతామని జడ్జి వాయిదా వేశారు. అవినాష్ ను అరెస్ట్ చేసే విషయంలో ఎలాంటి ఆటంకాలు సీబీఐకి లేవు. పులివెందులలోనే వారు ఉన్నందున ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close