మోదీకి వ్యతిరేకం కాదని ఆర్నాబ్ చానల్ ద్వారా చంద్రబాబు సిగ్నల్స్ !

పొత్తుల గురించి కాకపోయినా… మోదీ విషయంలో తాను వ్యతిరేకంగా లేనని.. అవసరం పడితే తాను మోదీ వైపే ఉంటానని చంద్రబాబు సిగ్నల్స్ పంపారు. ఆర్నాబ్ గోస్వామి టీవీ చానల్ రిపబ్లిక్ టీవీ రెండు రోజుల పాటు ఓ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఆ స్మిట్‌లో చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొని మోదీ విధానాలను ప్రశసించారు. ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్ గా మర్చే సత్తా మోదీకి ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచంలో భారత్ కు మోదీ ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలను .. అభివృద్ధి విధానాలను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ విషయంలో తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ప్రత్యేకహోదా సెంటిమెంట్ వల్లనే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ పురోగమిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ పొజిషన్‌లో ఉందని తెలిపారు. దేశంలో సాంకేతికతకు.. విజ్ఞానానికి ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణ మరింత పారదర్శకత తీసుకు వచ్చిందన్నారు. ఐదు వందల కన్నా ఎక్కువ డినామినేషన్ ఉన్న నోట్ల రద్దును తాను సమర్థిస్తానని తెలిపారు.

2014లో ఎన్డీఏలో కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో భాగస్వాములయ్యారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నించారు. చురుకుగా దేశవ్యాప్తంగా పర్యటించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం అనుకూలంగా రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో దూరం జరిగారు. జాతీయ రాజకీయాలను పట్టించుకోవడం మావేశారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా మోదీ వైపే ఉంటానని సిగ్నల్స్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close