నవరత్నాల్లో కేంద్ర నిధులున్నాయని బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చిందా..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏడాది తర్వాత ఏపీ సర్కార్‌పై కాస్త విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు విమర్శలకు వారు ఎంచుకున్న అంశం.. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర నిధులు ఉండటం. కేంద్రం ఇస్తున్న నిధులలతో పథకాలు అమలు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేసుకుంటున్నారని.. బీజేపీ నేతలు తాజాగా ఆరోపించడం ప్రారంభించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి … చిరు వ్యాపారులకు రూ. పదివేల వరకూ.. పూచీకత్తు లేని రుణాలను ఇచ్చే పథకాన్ని ప్రవేశ పెట్టారు. కోవిడ్ కారణంగా వ్యాపారాలు లేని.. తోపుడు బండ్లు.. చిన్న చిన్న టీస్టాల్స్ నిర్వాహకులకు ఈ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే.. ఇది ఇస్తోందని కేంద్రమని.. జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకుంటున్నారని బీజేపీ నేతలు తెర ముందుకు వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. పీఎం స్వానిధి పేరుతో… అమలు చేయడం ప్రారంభించారు. ఏపీలో ఆ పీఎం స్వానిధి కాస్తా.. జగన్నతోడుగా మారిందని.. బీజేపీ నేతలు మండిపోతున్నారు. ఏపీ సర్కార్ తీరుపై.. కేంద్రానికి ఫిర్యాదు చేశామని అంటున్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తూ.. స్టిక్కర్ సీఎంగా మారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై కేంద్ర నిధులతో నడిచే పథకాలకు.. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు.. ప్రధానమంత్రి ఫోటో కూడా వాడాలని.. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

అయితే… కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు..అత్యధికం వయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అమలవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం కేంద్రం నేరుగా అమలు చేస్తూ ఉంటుంది. అయితే అవిచాలా తక్కువ. పీఎం కిసాన్ యోజన లాంటి పథకాలు నేరుగా అమలు చేస్తోంది. అయితే.. ఏపీ సర్కార్.. దాన్ని కూడా.. రైతు భరోసాలో కలిపేసి… తామే అమలు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. కేంద్రం నేరుగా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తున్నప్పటికీ.. అది జగన్ సర్కారే వస్తున్నట్లుగా ప్రచారం చేస్తోంది. ఇది గత ఏడాది నుంచి జరుగుతోంది. ఈ ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పుడు.. మోడీ బొమ్మ కూడా ప్రకటనల్లో వేయలేదు. అప్పుడు కనీసం.. బీజేపీ నేతలు మాట్లాడలేదు.

కరోనా సహాయ చర్యల నిమిత్తం.. కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్, రూ. వెయ్యి సాయం కూడా.. జగనే ఇచ్చారని వాలంటీర్లు.. వైసీపీ నేతలు ఊరూరా ప్రచారం చేశారు. అది కేంద్రం ఇచ్చిన నిధులని.. టీడీపీ నేతలు రచ్చ చేశారు కానీ… బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడే గుర్తొచ్చినట్లుగా కొత్తగా విమర్శలు ప్రారంభించారు. అదీ కూడా.. బీజేపీలోని ఓ వర్గమే వైసీపీకి అనుకూలంగా ఉండేవారు మాత్రం.. నోరు మెదపడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close