అమరావతిలో కేంద్ర సంస్థ నిర్మాణాలు షురూ..ఇదే క్లారిటీ !?

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసిన మూడు రోజుల వ్యవధిలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అమరావతిలో భూమి తీసుకున్న ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్మాణాలు ప్రారంభించారు. తుళ్లూరు-రాయపూడి మధ్య నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలాయనికి గత ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండెకరాల స్థలంలో తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.

కానీ తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఆగిపోయింది. శంకుస్థాపన చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా సంస్థ తమ కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు చేపట్టారు. రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజధాని ఏదో ఖరారు చేస్తే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆర్బీఐ నుంచి ఏపీకి సమాచారం వచ్చింది.

కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగతా కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఎలా ఉన్నా ఇప్పుడు కేంద్రం కూడా అమరావతికే మొగ్గు చూపుతోందని బీజేపీ నాయకుల ఇటీవల ప్రకటనల బట్టి స్పష్టమవుతోంది. దీంతో అమరావతికి ఊపిరి వస్తోందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

సజ్జలపై క్రిమినల్ కేసు… పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడిది..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు...

సినిమా థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్

అవును... మీరు చ‌దివింది నిజ‌మే. మూవీ థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌డ‌తారా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close