కాళేశ్వరంపై కేంద్రం విచారణ !?

తెలంగాణ రాజకీయాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ నిరుపయోగమని.. అనుమతులు లేవని .. కేసీఆర్ కమిషన్ల కోసమే కట్టారన్న ఆరోపణలను ఇప్పుడు బీజేపీ వైపు నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణ నేతలు ఎప్పట్నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ స్వయంగా ఇప్పుడు కాళేశ్వరం గురించి చెబుతున్నారు. అదో దండగమారి ప్రాజెక్ట్ అని చెప్పడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని … అందుకే వరదలకు కొట్టుకుపోయిందని అంటున్నారు.

అయితే బీజేపీ నేతలదంతా డ్రామా అని… కేంద్రం చేతిలో అధికారం ఉండి..కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ చేయించరని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే టీఆర్ఎస్ కూడా అనుమతులు.. అప్పులు కూడా ఇచ్చింది కేంద్రమే కదా అని. మండిపడుతోంది. కాళేశ్వరం విషయంలో తాము చేస్తున్న ఆరోపణలకు బీజేపీ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత నిరర్థకమో.. కేంద్ర జలశక్తి శాఖ నోట్ విడుదల చేస్తుందని.. అనుమతులు లేకుండా కట్టారనే విషయాన్ని వెల్లడించబోతోందని అంటున్నారు.

ఇక ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు లక్ష కోట్లలో ఎంత దుర్వినియోగం అయిందో కూడా అధికారికంగా బయట పెడతారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లపై కూడా త్వరలో ఈడీ దాడులు జరుగుతాయని అందులో సందేహమే లేదని బీజేపీ వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు వరదల వల్ల ఆ ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీని పూర్తి స్థాయిలో బయటకు వచ్చేలా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా చూస్తే.. కాళేశ్వరం చుట్టూనే రాజకీయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close