ఖాతా క్లియర్ : పోలవరం బిల్లులు ఇక ఆ ప్రాజెక్టుకే..!

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విడుదల చేసే నిధులు ఆ ప్రాజెక్టుకు మాత్రమే ఖర్చు చేయాలని ఇతర వాటికి మళ్లించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చేసింది. గత ఏడాది ఇలా విడుదల చేసిన నిధులు.. దాదాపు రూ. మూడు వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేసేయడంతో ఈ సారి కేంద్రం రూటు మార్చింది. ప్రత్యేకంగా ఖాతా ఏర్పాటుచేసి.. ఇప్పుడు విడుదల చేయాల్సి ఉన్న రూ. 2200 కోట్లను విడుదల చేయబోతోంది. పోలవరం ప్రాజెక్టుకు తప్ప.. మరో అవసరానికి ఆ నిధులు ఖర్చు చేయడానికి లేదు. ప్రస్తుతం ఆ ఖాతా నిర్వహణ విధి విధానాల ఖరారులో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు మొదట ప్రభుత్వం ఖర్చు పెడితే.. తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఆ ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్టును నిర్మించి.. వేల కోట్లతో పనులు చేయించింది. అలా ప్రభుత్వం దిగిపోయే సరికి.. ఆరు వేల కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక విడత మంజూరు చేశారు. వాటిని ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంది. దానికి కారణం కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులను ఇప్పటికే పోలవరంలో ఖర్చు చేసేశారనేదే ఆ కారణం. ఇప్పుడు మరో విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 200 కోట్ల పనులు కూడా జరగలేదని.. రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చే నిధులు కూడా ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేస్తే.. ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోతుందని కేంద్రం ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది.

ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులు ఇంత వరకూ విడుదల కాలేదు. అదే పనిగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి ఢిల్లీకి తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రత్యేక ఖాతా ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త అంచనాలు అంగీకరిస్తేనే ఈ రెండు వేల కోట్లు ఇస్తామని గత పీపీఏ మీటింగ్‌లో కేంద్రం చెప్పింది. చివరికి.. ఈ సారికి ఇస్తామని..మరోసారి నిధులు విడుదల చేయాలంటే.. తగ్గించిన అంచనాలు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది., ఈ నిధులు వస్తే చాలనుకుందేమో కానీ ప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు.. ఇంకా ఆలస్యం అవుతోదంది. ఒక వేళ వచ్చినా… ప్రాజెక్టుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close