ఆ దేశాలకు వెళ్ళకండి… కేంద్రం బిగ్ అలర్ట్..!!

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లేవారికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు దేశాలకు వెళ్ళేవారు కొంతకాలం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. పశ్చిమ ఆసియా దేశాల్లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేవని..ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది.

ఇరాన్ లో 4 వేల మంది, ఇజ్రాయెల్ లో 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటించడం ఏమాత్రం సురక్షితం కాదని భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో భారతీయ ఎంబసీలతో అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండు దేశాలలో ఉన్న భారతీయులు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ద వాతావరణం కమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందంటూ ప్రముఖ జర్నల్ వాల్ స్ట్రీట్ ఓ కథనం కూడా ప్రచురించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయెల్ కూడా మద్దతు నిలవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే భారీ ప్రాణ, ఆస్థి నష్టం సంభవించే అవకాశం ఉందని భారత్ అంచనా వేస్తోంది. అందుకే ప్రమాదాన్ని ముందే గుర్తించి.. అక్కడి భారతీయ పౌరులను అలర్ట్ చేయడంతోపాటు అక్కడికి వెళ్ళే వారిని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close