క్రెడిట్ బీజేపీకే..! ఏపీకి కేంద్రబృందం..!

వరదలు వచ్చాయి…పోయాయి. వరదలు వచ్చిన వారం రోజులకు సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. రెండు వారాలకు కేంద్ర బృందం ప్రకటన ఉంటుందని ప్రకటన వచ్చింది. మూడు వారాలకు వారు వచ్చి.. పరిశీలిస్తే.. ఆ తరవాత కుదిరినప్పుడు సాయం చేస్తారు. అయితే.. ఏపీ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కేంద్రం మాత్రం ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. వరద నష్టం అంచనా వేసి… సాయం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఆలస్యంగా అయినా కాస్త రాజకీయంగా ఆలోచించారు. పొరుగున ఉన్న తెలంగాణలో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వరదల సెగ తగిలింది.

అంత పెద్ద వరదలు వచ్చి హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడుతూంటే.. కేంద్రం నుంచి సాయం రావడం లేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడంతో .. కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర బృందాన్ని తెలంగాణకు పిలిపించి.. నష్టాన్ని ఎన్యూమరేషన్ చేయించారు. ఇక సాయం చేస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. ఏపీకి ఆ కేంద్ర బృందం కూడా అదీ గతీ లేదు. దీంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఏపీ సర్కార్ ఎలాగూ అడగడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలే రంగంలోకి దిగారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రితో వర్చువల్ భేటీ ఏర్పాటు చేసుకుని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఏపీలో ప్రభుత్వం ఉన్నా.. లేనట్లే అనుకోవాలని.. కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. సరే అని.. కేంద్ర వ్యవసాయ మంత్రి… కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. మరో వారంలో వారి పర్యటన ఉండొచ్చు.

కానీ వరదలు వచ్చి మూడు వారాలు అయిపోయిన తర్వాత వారికి ఎలాంటి నష్టం కనిపిస్తుందనేది సందేహమే. ఇప్పటికే కేంద్రం ఇచ్చే సహాయంపై సందిగ్ధం నెలకొంది. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. రూ. వెయ్యి కోట్లు తక్షణ సాయం ప్రకటించారు మోడీ. కానీ నికరంగా వచ్చిన సాయం మాత్రం రూ. 750 కోట్లేనని ప్రభుత్వ వర్గాలుచెబుతూంటాయి. అలాంటిది.. వరదలకు పంట నష్టం జరిగితే.. ఎంత ఇస్తారనేది సందేహమే. కానీ రాజకీయంగా మాత్రం.. బీజేపీ లీడర్లు ఓ స్కోర్ చేయడానికి ఈ కేంద్ర బృందం ఉపయోగపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close